ఎంపీని చేస్తానని తల్లిని కూడా మోసం చేసిన జగన్ : షర్మిల

జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై షర్మిల సంచలన విషయాలు బయట పెట్టారు. షర్మిల రాజకీయాన్ని కించ పరిచేందుకు ఆమెకు పదవీ కాంక్ష అని..డబ్బులు అడిగితే ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చేరారని జగన్ విమర్శలు చేస్తున్నారు. రోజు రోజుకు జగన్ .. షర్మిలపై చేస్తున్న విమర్శల దాడి పెరుగిపోతోంది. తాజాగా టీవీ9 ఇంటర్యూలో షర్మిల వ్యక్తిత్వాన్ని కించ పరిచేలా మరిన్ని వ్యాఖ్యలు చేశారు. దాంతో షర్మిల మీడియా ముందుకు వచ్చారు. భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు.

ఎంపీని చేస్తానని అమ్మకిచ్చిన మాటనే జగన్ నిలబెట్టుకోలేదు. ఆయన విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని సంచలన విషయం బయట పెట్టారు. జగన్ మోహన్ రెడ్డి మానసిక స్థితిపై తనకు ఎంతో కన్సర్న్ ఉందని ఎద్దేవా చేశారు. ఈ మాటలు మాట్లాడుతూ షర్మిల విలపించారు.

తన రాజకీయ కాంక్షే రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో విభేదాలకు కారణమని జగన్ చెప్పారని.. ఆవేదన వ్యక్తం చేశారు. తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరని షర్మిల ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అరెస్టు టైంలో , 19 ఎమ్మెల్యేలు రాజీనామా చేసినప్పుడు ఉపఎన్నికల్లో ప్రచారం చేయమని అడిగిందని ఎవరని షర్మిల ప్రశ్నించారు. పాదయాత్ర చేయమని అడిగింది మీరు కాదా అని ప్రశఅనించారు. ఎప్పుడు అవసరం ఉంటే ఆ అవసరానికి సమైఖ్యాంధ్ర, బైబై బాబు క్యాంపెయిన్, తెలంగాణలో పాదయాత్ర చేపించింది మీరు కాదా అని జగన్ మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.

నిజంగా రాజకీయ కాంక్ష ఉంటే పాదయాత్ర చేసినప‌్పుడు జైల్లో ఉన్నారు. అప్పుడు వైసీపీని హస్తగతం చేసుకునే ఉంటే అడిగేది ఎవరని మండిపడ్డారు.

పొందాలనుకున్న పదవి మొండిగానైనా పొందగలనని షర్మిల స్పష్టం చేశారు. వివేకా లాంటి ఎంతో మంది తనను ఎంపీగా చేయాలని అనుకున్నారు. మీ పార్టీలోనే చాలా మంది ఉన్నారని గుర్తు చేశారు. మీతో ఉన్నంత కాలం సీఎంగా అయ్యే వరకు నాకు అలాంటి ఆలోచన లేదని స్పష్టం చేశారు. షర్మిలపై జగన్ విమర్శలు పెంచే కొద్దీ షర్మిల ఎమోషనల్ రాజకీయాల డోస్ పెంచుకుంటూ పోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

భార్యా బాధితులను కామెడీగానే చూస్తున్న సమాజం !

తన భార్య నుండి తనకు , తన తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలంటూ ఓ బాధిత భర్త పోలీసులను వేడుకుంటూ ప్రెస్ మీట్ పెట్టారు. హైదరాబాద్ లో ఘటన...

అప్పుడే ప్రతిపక్ష పాత్ర పోషిస్తోన్న వైసీపీ..!!

ఏపీలో వైసీపీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. ఎన్నికల ఫలితాన్ని ముందుగానే పసిగట్టారో మరేమిటో, అప్పుడే ప్రతిపక్ష పాత్రకు అలవాటుపడుతున్నట్లు కనిపిస్తోంది. అతిశయోక్తి అనిపించినా ఆ పార్టీ నేతలు చేస్తోన్న వరుస వ్యాఖ్యలు...
video

‘గం గం గణేశా’ ట్రైలర్ : నవ్వించే దొంగ

https://www.youtube.com/watch?v=wBZ7EUIM7fY బేబీతో ఓ యూత్ ఫుల్ విజయాన్ని అందుకున్న ఆనంద్ దేవరకొండ ఇప్పుడు 'గం గం గణేశా' సినిమా తో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ఇదొక క్రైమ్ కామెడీ. తాజాగా ట్రైలర్ ని వదిలారు....

జగన్ ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేసిన వైవీ సుబ్బారెడ్డి

వైవీ సుబ్బారెడ్డి జగన్ రెండో ప్రమాణస్వీకార ముహుర్తం పెట్టేశారు. విశాఖలో ప్రమాణం చేస్తానని జగనే ప్రకటించారు కాబట్టి ఎక్కడ అనే సందేహం లేదు. తొమ్మిదో తేదీన ప్రమాణం చేస్తారని బొత్స సత్యనారాయణ ఇంతకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close