రాజధాని రైతులకు మద్దతుగా వైసీపీ ఎంపీ..!

అమరావతి రైతులను.. ప్రభుత్వం చర్చలకు ఒప్పించే బాధ్యతను నర్సరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయులు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. అమరావతి రైతులకు కనీసం సానుభూతి ప్రకటించడానికి ఇంత వరకూ.. ఒక్కరంటే.. ఒక్క వైసీపీ నేత కూడా ముందుకు రాలేదు. మొదటి సారి.. లావు కృష్ణదేవరాయులు రాజధాని గ్రామాల్లో రైతుల ఆందోళనల శిబిరాలను సందర్శించారు. రైతుల దీక్షకు సంఘీభావం తెలిపారు. అక్కడ ఆయన రైతులపై ఇంతకు ముందెన్నడూ చూపించనంత సానూభూతి చూపించారు. రైతుల ఆవేదన అర్థం చేసుకోగలమని.. ప్రభుత్వం అందర్నీ ఆదుకుంటుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చర్చలకు పిలుస్తుందని.. . అందరూ వెళ్లి తమ అభిప్రాయాలు చెప్పాలని సూచించారు.

రైతులు వ్యాపారాలు చేసి సంపాదించిన భూములు కాదని.. వారికి భూములతో భావోద్వేగం ఉంటుందని.. మంచి మాటలు చెప్పి రైతుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. భూములిచ్చిన ఎవరికీ అన్యాయం జరగదన్నారు. అయితే.. పలు చోట్ల.. రైతులు ముందుగా.. లావు కృష్ణదేవరాయులు అమరావతికి అనుకూలమో.. వ్యతిరేకమో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో కానీ.. ప్రభుత్వం నియమించే కమిటీలతో కానీ చర్చలు జరపాలంటే.. ముందుగా.. అమరావతిని కొనసాగిస్తున్నట్లుగా ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. అయితే వైసీపీ ఎంపీ మాత్రం.. ఈ విషయంలో నోరు తెరవలేకపోయారు. రాజధాని గ్రామాలు గుంటూరు ఎంపీ నియోజకవర్గ పరిధిలో ఉంటాయి.

నర్సరావుపేట పరిదిలో ఉండవు. అయినప్పటికీ.. లావు కృష్ణదేవరాయులు ప్రత్యేకంగా రాజధాని గ్రామాలకు వచ్చారు. పార్టీ హైకమాండ్ ఆదేశాల మేరకు… రైతులను కూల్ చేసి.. వారితో.. చర్చలకు అంగీకరించేలా చేసేందుకు కృష్ణదేవరాయుల్ని వైసీపీ ప్రయోగించిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రభుత్వం నియమించే కమిటీతో రైతులు చర్చలు జరిపితే .. ఏదోవిధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవచ్చని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close