షరతుల్లేకుండానే రాజ్యసభలోనూ వ్యవసాయ బిల్లుకు వైసీపీ మద్దతు..!

కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న సమయంలో.. వైసీపీ బీజేపీకి అండగా నిలిచింది. ఎన్డీఏ పక్షంలోని పార్టీలే ఆ బిల్లులను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్న సమయంలో.. వైసీపీ ఎలాంటి మొహమాటాలు పెట్టుకోలేదు. తాము మద్దతిస్తున్నామని రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయిరెడ్డి ప్రకటించారు. ఈ బిల్లుల వల్ల రైతులు ఎదుర్కొంటున్న మద్దతు ధర, గిట్టుబాటు ధర సమస్య పరిష్కారం అవుతుందని విజసాయిరెడ్డి ప్రకటించారు. వైసీపీకి రాజ్యసభలో ఆరుగురు సభ్యులు ఉన్నారు. వారి మద్దతు ప్రస్తుతం బీజేపీకి ఎంతో కీలకం. అకాలీదళ్‌తో పాటు ఇంత కాలం ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో సహకరిస్తున్న టీఆర్ఎస్ లాంటి పార్టీలు వ్యతిరేకంగా ఓటు వేయాలని నిర్ణయించుకున్నాయి. దీంతో వైసీపీ మద్దతు బీజేపీకి కీలకంగా మారింది.

రాజ్యసభలో కేంద్రానికి ఎంపీల అవసరం వచ్చినప్పుడు.. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకహోదా వంటిఅంశాలపై పట్టుబట్టి సంతకం పెట్టిన తర్వాతనే మద్దతిస్తామని జగన్మోహన్ రెడ్డి అదే పనిగా చెప్పేవారు. ఇప్పుడు ఎలాంటి షరతుల్లేకుండా.. మద్దతిచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే .. రాజధాని భూములు, ఫైబర్ నెట్‌ వంటి వాటిపై సీబీఐ విచారణ జరిపించాలనే అంశాలపై వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఈ దిశగా రాజకీయంగా ఉపయోగపడే అంశాలపై వారు అంతర్గతంగా మాట్లాడుకుని ఉంటారన్న చర్చ ఢిల్లీలో జరుగుతోంది.

వ్యవసాయ బిల్లులు రైతుల కష్టాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేలా ఉన్నాయన్న విమర్శలు దేశవ్యాప్తంగా వస్తున్నాయి. ఆందోళనలు కూడా పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఇప్పుడిప్పుడే దక్షిణాదికి కూడా.. ఆ ఆందోళనలు విస్తరిస్తున్నాయి. అయినప్పటికీ.. వైసీపీ రైతుల ఆందోళనల్ని ఏ మాత్రం పట్టించుకోకుండా.. కేంద్రానికి మద్దతిచ్చేందుకు సిద్ధమయింది. గతంలో ఎన్నార్సీ బిల్లుకు కూడా అలాగే మద్దతిచ్చింది. రాష్ట్రంలో ఆందోళనలు పెరిగే సరికి.. వ్యతిరేకిస్తామని సీఎం జగన్ ప్రకటించారు. బిల్లుకు మద్దతుగా ఓటేసిన తర్వాత వ్యతిరేకించడం ఏమిటో.. చాలా మందికి అర్థం కాలేదు. కానీ అదే రాజకీయం. ఇప్పుడు వ్యవసాయబిల్లు విషయంలోనూ రైతుల ఆందోళనలు పెరిగిపోతే.. తర్వాత అదే చెప్పే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close