వైసీపీ టిక్కెట్ ఎంపీ కుటుంబసభ్యులకు కాదు..!?

ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై మెల్లగా చర్చ ప్రారంభమవుతోంది. వచ్చే ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించేసి.. క్షేత్ర స్థాయి కార్యచరణ ప్రారంభించారు. ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేసి.. గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేశారు. వైసీపీ అధినేత జగన్.. స్థానిక ఎన్నికలను ఫిబ్రవరిలో నిర్వరించకుండా చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు కానీ.. లోక్‌సభ ఉపఎన్నికను మాత్రం ఆపలేరు. కరోనా అని మరోకటని కారణం చెప్పలేరు. అలా చెప్పే చాయిస్ కూడా లేదు. అందుకే… ఎన్నికను ఎదుర్కోవాల్సిందే. ఈ కారణంగా అభ్యర్థి ఎంపికపై దృష్టి పెట్టారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే.. నెల్లూరు, చిత్తూరు జిల్లాల ముఖ్యులతో జగన్ సమావేశం అయ్యారు.

తిరుపతి లోక్‌సభ పరిధిలో ప్రస్తుత పరిస్థితి… పార్టీల బలాబలాలపై చర్చించారు. అయితే.. ప్రస్తుతం వైసీపీ ఇంకా బలపడిందని.. ప్రతిపక్షాలు ఇంకా బలహీనపడ్డాయని… గతంలో వచ్చిన మెజార్టీ కన్నా ఎక్కువగా వస్తుందని పార్టీ నేతలు…జగన్‌కు సూచించారు. చిత్తూరు జిల్లాలో భారీ మెజార్టీ తెస్తానని మంత్రి పెద్దిరెడ్డి జగన్ కు హామీ ఇచ్చారు. నెల్లూరు బాధ్యతలను కూడా తీసుకుంటానని చెప్పినట్లుగా తెలుస్తోంది. అభ్యర్థిగా ఎవరుండాలన్నదానిపై జగన్ సమాలోచనలు జరిపారు. ఎవరైనా సిట్టింగ్ సభ్యుడు చనిపోతే.. వారి కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇవ్వడం సంప్రదాయంగా వస్తోందని నేతలు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. చనిపోయిన బల్లి దుర్గా ప్రసాద్ కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి లేదా.. భార్యకి టికెట్ ఇస్తే సానుభూతి ఓట్లు వస్తాయని లెక్కలేసి చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం.. వేరే ఆలోచనలో ఉన్నారు. తనకు ఫిజియోథెరపిస్ట్ గా చేసిన ఓ డాక్టర్ కు టిక్కెట్ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

టిక్కెట్‌ను బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబసభ్యులకు కాకుండా ఇతరులకు ఇవ్వాలనుకుంటున్న విషయాన్ని జగన్ మరో విధంగా అభిప్రాయం వ్యక్తం చేయడంతో… ఇతర నేతలు సైలెంటపోయిపోయారు. అభ్యర్థిత్వాన్ని ఎవరికి ఇచ్చినా గెలిపించి తీసుకు వస్తామని జగన్ కు హామీ ఇచ్చి బయటకు వచ్చారు. బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబసభ్యుల్లో ఒకరికి ఎమ్మెల్సీ ఇద్దామని.. జగన్ ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పటికైతే ఏ విషయాన్ని ఖరారు చేయలేదు. కానీ జగన్ మాత్రం.. బల్లి దుర్గా ప్రసాద్ కుటుంబసభ్యులకు టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని.. వైసీపీలో ఓ అభిప్రాయానికి వచ్చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close