ఒక్క భేటీ- వైసీపీ ఇన్నికోణాల్లో భయపడుతోందేంటి?

చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లారు. అమిత్ షా ను కలిశారు. వారి మీటింగ్ మధ్యలో జేపీ నడ్డా వచ్చి కలిశారు. మాట్లాడుకున్నారు. ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోయారు. పొత్తులు ఉంటాయా .. ఉంటే ఎక్కడ .. అసలు రాజకీయాలపైనే మాట్లాడారా అనే సందేహాలు ఉండనే ఉన్నాయి. ఆ మీటింగ్ ఏం చర్చించారో కానీ… వైసీపీ మీడియా.. కూలీ .. నీలి మీడియా మొత్తం వివిధ కోణాల్లో తమ భయాందోళనలు వ్యక్తంచేస్తూ వస్తోంది.

ఒకరేమో జగన్ నుంచి రామోజీరావును కాపాడమని వెళ్లారని రాసుకుంటారు. ఒకరేమో పొత్తులు పెట్టుకోవాలని బతిమాలుకోవాలని వెళ్లారంటారు.. మరొకరేమో విలీన ప్రతిపాదన పెట్టారంటారు…. వీళ్లు కంగారు చూస్తే.. మొత్తంగా.. చంద్రబాబు ఏదో బ్లాక్ మ్యాజిక్ చేసేసి… జగన్ ఎంతో కష్టపడి పొందుతున్న రిలీఫ్ లన్నీ తెగ్గొట్టేసి వచ్చి ఉంటారేమో అని భయపడుతున్నట్లుగా కనిపిస్తోందని సహంజగానే సెటైర్లు పడుతున్నాయి. హత్య లాంటి తీవ్రమైన కేసులు సహా ఎన్నో కేసులు వెనుకేసుకుని ఏ మాత్రం రాజకీయంగా సస్టెయిన్ అయ్యే అవకాశం లేని నేతగా జగన్ ప్రస్తుతం అందరి కళ్ల ముందు ఉన్నారు.

ఆయనను బీజేపీ నమ్ముకునే అవకాశాలు తక్కువ .ఏ మాత్రం వెన్నుముక లేని వ్యవహారం.. సొంత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెడుతున్న తీరు… కేంద్ర పెద్దలుక కూడా ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది. ఆయనను నమ్మకమైన రాజకీయ నాయకుడిగా భావించలేరు. పైగా చంద్రబాబు ఓ సారి ఎవరితోనైనా సమావేశం అయితే.. మొత్తంగా వాళ్లను తన స్కిల్స్ తో తనకు తగ్గట్లుగా మార్చేసుకుంటారన్న అభిప్రాయం కూడా ఉంది. దీంతో జగన్ క్యాంప్ కంగారు పడుతోంది. ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతోంది. అందుకే చంద్రబాబు – షాల భేటీపై రకరకాల ప్రచారాలు తెరపైకి తెస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆసుపత్రి వ్యాపారంపై మాధవీలత సంచలన వ్యాఖ్యలు

మాధవీలత... బీజేపీ హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి. ఎంఐఎంకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాద్ సెగ్మెంట్ లో ఈసారి జెండా పాతుతామని చెప్తున్నా బీజేపీ నేతల వ్యాఖ్యలకు తగ్గట్టుగానే మాధవీలత అందరి దృష్టిని...

బీఆర్ఎస్ కు బిగ్ షాక్ – కాంగ్రెస్ లోచేరిన కేటీఆర్ బావమరిది..!

లోక్ సభ ఎన్నికల ముంగిట బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, కీలక నేతలు పార్టీని వీడుతుండగా తాజాగా కేటీఆర్ బావమరిది ఎడ్ల రాహుల్ రావు...

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close