లగడపాటి ‘ల్యాంకో’ దివాళా?

హైదరాబాద్: లగడపాటి రాజగోపాల్ నెలకొల్పిన ల్యాంకో సంస్థలు దివాళాకు సిద్ధంగా ఉన్నాయి. ల్యాంకో ఇన్‌ఫ్రా సంస్థ ఈ ఏడాది మార్చ్ నాటికి రు.35 వేలకోట్లకు పైగా అప్పుల్లో కూరుకుపోయింది. వడ్డీలకారణంగా ఈ మొత్తం రోజురోజుకూ పెరుగుతోంది. మరోవైపు కంపెనీ పరిస్థితి ఇలా ఉండటంతో షేర్ మార్కెట్‌లో ఆ సంస్థ షేర్ విలువ దారుణంగా పతనమయింది. ఒక సమయంలో రు.80 ఉన్న ల్యాంకో షేర్ ఇప్పుడు రు.3 కు పడిపోయింది. దీనితో అనేక చోట్ల ఉన్న తమ విద్యుత్ ప్లాంట్‌లను అమ్మకానికి పెట్టారు.

లగడపాటి రాజగోపాల్ 1990వ దశకంలో ల్యాంకో సంస్థను స్థాపించి విజయవాడ సమీపంలోని కొండపల్లిలో విద్యుత్ ప్రాజెక్ట్ ప్రారంభించారు. తర్వాత ఆయన సోదరులు మధుసూదనరావు, శ్రీధర్ కూడా ఆయనకు వ్యాపారంలో చేదోడు వాదోడుగా నిలిచారు. ఆ తర్వాత సంస్థ కోల్ మైనింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తదితర రంగాలలోకి విస్తరించి భారీ విజయాలను చేజిక్కించుకుంది. హైదరాబాద్‌లోని మణికొండ ప్రాంతంలో ‘ల్యాంకో హిల్స్’ పేరుతో భారీ ప్రాజెక్ట్ నిర్మించింది. అయితే 2008 నుంచి కంపెనీకి కష్టకాలం మొదలయింది.దీనికి కారణం విద్యుత్ రంగంలో ఏర్పడిన సంక్షోభమని కంపెనీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అప్పులు కొండలా పెరిగిపోవటంతో కొన్ని విద్యుత్ ప్లాంట్‌లను ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి, గ్రీన్‌కో ఎనర్జీస్ సంస్థకూ అమ్మేశారు. ఉద్యోగుల సంఖ్యను 7,000 నుంచి 4,000కు తగ్గించారు. కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్(సీడీఆర్) ప్యాకేజ్ కోసం బ్యాంక్‌లను ఆశ్రయించారు. బ్యాంక్‌లను నయానో, భయానో ఒప్పించి ప్యాకేజ్ పొందాలని ప్రయత్నిస్తున్నారు. లగడపాటి రాజగోపాల్ ఇటీవల ఢిల్లీలో చంద్రబాబును కలవటానికి కారణంకూడా ఇదేనంటున్నారు. అప్పులఊబిలో ఉన్న ల్యాంకో ఇన్‌ఫ్రాను గాడిన పెట్టటానికి లగడపాటి ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనా సంస్థలు దివాళా తీసినా యజమానులు మాత్రం దర్జాగానే జీవిస్తుంటారు. ఎటొచ్చీ నష్టపోయేది బ్యాంక్‌లూ, షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌లూ. ఆ మధ్య ఒక వెలుగు వెలిగిన జీఎమ్ఆర్(గ్రంథి మల్లికార్జునరావు) గ్రూప్ పరిస్థితికూడా ఇప్పుడు దాదాపు ల్యాంకో తరహాలోనే ఉందని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

షర్మిలకు రూ. 82 కోట్ల అప్పు ఇచ్చిన జగన్ !

నామినేషన్ దాఖలు చేసే ముందు వైఎస్ జగన్‌కు షర్మిల పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాను జగన్మోహన్ రెడ్డికి రూ. 82 కోట్లకుపైగా బాకీ ఉన్నట్లుగా అఫిడవిట్‌లో తెలిపారు. వదిన భారతి...

మోత్కుపల్లికి అస్వస్థత.. కారణం అదేనా..?

మాజీ మంత్రి , కాంగ్రెస్ అసంతృప్త నేత మోత్కుప‌ల్లి న‌ర్సింహులు(69) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఒక్కసారిగా ఆయన బీపీ డౌన్ కావడం , షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురైనట్లుగా...
video

‘భ‌జే వాయు వేగం’ టీజ‌ర్‌: ఓ కొడుకు పోరాటం

https://youtu.be/CjtiMKi7jbg?si=1YPpsj9q7ohLmqYy 'ఆర్‌.ఎక్స్‌.100'తో ఆక‌ట్టుకొన్నాడు కార్తికేయ‌. అయితే ఆ తర‌వాతే స‌రైన హిట్ ప‌డ‌లేదు. 'బెదురులంక' కాస్త‌లో కాస్త ఊర‌ట ఇచ్చింది. ఇప్పుడు యూవీ క్రియేష‌న్స్‌లో ఓ సినిమా చేశాడు. అదే.. 'భ‌జే వాయువేగం'. ఐశ్వ‌ర్య...

ప్రియదర్శి తాటతీసే ‘డార్లింగ్’

హనుమాన్ విజయం తర్వాత నిర్మాత నిరంజన్ రెడ్డి కొత్త సినిమా ఖరారు చేశారు. ప్రియదర్శి హీరోగా ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి డార్లింగ్ అనే టైటిల్ పెట్టారు. అశ్విన్ రామ్ దర్శకుడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close