30 ఇయర్స్ ఇండస్ట్రీ.. ఫృథ్వీరాజ్ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలని చూసిన సంగతి తెలిసిందే. వైకాపాలో చేరి, ఆ పార్టీ ప్రచారం కోసం ముమ్మరంగా తిరిగాడు. పృథ్వీరాజ్కి ఎన్నికల్లో టికెట్ ఇవ్వకపోయినా… తిదేపాలో ఓ కీలక పదవి ఇచ్చింది వైకాపా. అయితే.. దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు ఫృథ్వీరాజ్. కొన్ని అనూహ్యపరిణామల మధ్య ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశాడు. ఇప్పుడు ఫృథ్వీ దృష్టిలో వైకాపా పెద్ద విలన్. ఆ పార్టీనీ, పార్టీ వైఖరిని ఎండగడతూ ఘాటు ఘాటు కామెంట్లు చేస్తున్నాడు. `బుద్ధి ఉన్నవాడెవడూ ఆ పార్టీలో ఉండడు` అంటూ మండిపడుతున్నాడు. అంతే కాదు. వైకాపాలో ఉన్నప్పుడు పవన్ని తిట్టినందుకు ప్రతీసారీ పశ్చాత్తాప పడుతున్నాడు. ఇప్పుడు పృథ్వీరాజ్ దృష్టి జనసేనపై పడిందని జనాలందరికీ అర్థమవుతూనే ఉంది. జనసేనా జెండా మోసి, ఆ పార్టీ కోసం పనిచేస్తానని పృథ్వీరాజ్ కూడా చెబుతున్నాడు. ఇదే విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లాడట. పవన్ కూడా సానుకూలంగా స్పందిచాడట. “అవసరమైనప్పుడు మిమ్మల్ని తప్పకుండా పిలుస్తా. ఈలోగా మీ సినిమాలు మీరు చేసుకోండి..`1` అని పవన్ మాట ఇచ్చేశాడని ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో మనసులోని మాట చెప్పేశాడు పృథ్వీరాజ్. తూగో, ప.గోల నుంచి.. ఫృద్వీరాజ్ అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండు జిల్లాల్లో పవన్ కి ఓ సామాజిక వర్గం నుంచి గట్టి మద్దతు ఉంది. పృద్వీ కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వాడే. కాబట్టి… జనసేన టికెట్ పై గట్టిగా ఆశలు పెట్టుకొన్నాడు.