తెలంగాణ రైతుల అకౌంట్లలో రూ. 5,249 కోట్లు..!

రైతు బంధు డబ్బులు ఇవ్వడం లేదని.. విపక్షాలు చేస్తున్న విమర్శలకు తెలంగాణ సర్కార్ ఒకే సారి చెక్ పెట్టింది. అందరి అకౌంట్లలోకి పథకం నిధులు ట్రాన్స్‌ఫర్ చేసింది. దాదాపుగా 51 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు పడ్డాయి. వ్యవసాయాధారిత రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడి రైతులకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతు భరోసా పథకం లబ్దిదారులు 40 లక్షలు మాత్రమే. తెలంగాణ సర్కార్ మాత్రం.. కులం చూడకుండా.. మతం చూడకుండా… అందరికీ.. పథకాన్ని వర్తింప చేసింది. అందుకే ఏపీ సర్కార్ ఇచ్చే దాని కన్నా రెండింతలు ఇస్తోంది. రైతు భరోసాకి ఏపీ సర్కార్ బడ్జెట్‌లో రూ. 3150 కోట్ల వరకూ కేటాయించింది. కానీ తెలంగాణ సర్కార్.. ఒక్క విడతలోనే రూ. 5200 కోట్లను విడుదల చేసింది. బడ్జెట్ కేటాయింపులు రూ. పన్నెండు వేల కోట్లు.

ఇంత భారీ చెల్లింపులు చేస్తున్నప్పుడు… ప్రభుత్వాలు కాస్త పబ్లిసిటీ చేసుకుంటాయి. యాభై, అరవై వేల మందికి సాయం చేసే పథకం అమలు చేసినా.. పత్రికల్లో ఫుల్ పేజీ ప్రకటనలు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాయి. అయితే.. తెలంగాణ సర్కార్ అలాంటి ఖర్చులేమీ పెట్టుకోలేదు. ప్రత్యేకంగా పబ్లిసిటీ సమావేశాలు పెట్టలేదు. రైతులతో ముఖాముఖి మాట్లాడి.. గొప్పలు చెప్పుకోలేదు. కానీ సాయం మాత్రం నేరుగా జమ చేసింది. వానాకాలం సీజన్‌లో ఎకరానికి రూ. 5 వేల చొప్పున 1.40 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఈ ప్రకారం 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి ఏక కాలంలో దాదాపు రూ.5,295 కోట్లు చేరాయి.

5 లక్షల మంది రైతులకు సంబంధించిన బ్యాంకు ఖాతాలు, ఆధార్‌, సెల్‌ఫోన్‌ నంబర్లు సరిగా లేకపోవటం, ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు, రాంగ్‌ నంబర్లు ఉండటంతో పెండింగ్‌లో పెట్టారు. రైతుబంధు పథకం ప్రారంభించిన తొలి ఏడాదిలో ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు చెక్కులు ఇచ్చారు. తర్వాత మూడు విడతల్లో డబ్బుల మంజూరు, పంపిణీలో జాప్యం జరిగింది. ఈసారి అలాకాకుండా ఒక్క రోజులోనే 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమచేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుకుమార్ కుమార్తెకు దాదా ఫాల్కే అవార్డ్

డైరెక్టర్ సుకుమార్‌ కుమార్తె సుకృతి వేణి సినీ రంగప్రవేశం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో న‌టించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ చిత్రాన్ని గ‌తంలో ప‌లు ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ప్రద‌ర్శించారు....

టీంమిండియాకి ‘ముంబై ఇండియన్స్’ కలవరం

కొత్త కుర్రాళ్ళతో టీ20 ప్రపంచకప్ బరిలో దిగుతుందని భావించిన భారత క్రికెట్ జట్టు.. అనూహ్యంగా సీనియర్లతోనే సరిపెట్టుకుంది. 2022 టీ20 ప్రపంచకప్‌లో పోటీపడిన జట్టులో ఎనిమిది మందికి మరోసారి అవకాశం వచ్చిందంటే.. ఈ...

‘లాపతా లేడీస్’ రివ్యూ: దారితప్పి మార్గం చూపిన పెళ్లి కూతుళ్ళు

'ధోబీ ఘాట్' లాంటి విలక్షణమైన సినిమా తీసిన కిరణ్ రావు, దాదాపు దశాబ్ద విరామం తర్వాత 'లాపతా లేడీస్' కోసం మళ్ళీ మెగాఫోన్ పట్టుకున్నారు. ఆమె దర్శకత్వంలో అమీర్ ఖాన్ నిర్మించిన ఈ...

టాలీవుడ్‌ ‘మే’ల్కొంటుందా?

2024 క్యాలెండ‌ర్‌లో నాలుగు నెల‌లు గ‌డిచిపోయాయి. ఈ వ్య‌వ‌ధిలో తెలుగు చిత్ర‌సీమ చూసింది అరకొర విజ‌యాలే. ఏప్రిల్ అయితే... డిజాస్ట‌ర్ల‌కు నెల‌వుగా మారింది. మే 13తో ఏపీలో ఎన్నిక‌ల హంగామా ముగుస్తుంది. ఆ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close