నిర్భయ కేసులో బాలనేరస్తుడి విడుదలకు హైకోర్టు లైన్ క్లియర్

డిల్లీ నిర్భయ సామూహిక అత్యాచారం, హత్య కేసులో బాలనేరస్తుడు మూడేళ్ళ నిర్బంధం (శిక్ష) పూర్తి చేసుకోవడంతో డిశంబర్ 20వ తేదీన విడుదలవుతున్నాడు. ఈ మూడేళ్ళు బాలనేరస్థుల గృహంలో ఉన్నపుడు అతను ‘డిల్లీ హైకోర్టు బాంబు ప్రేలుళ్ళ కేసు’లో శిక్ష అనుభవిస్తున్న మరొక బాలనేరస్తుడితో స్నేహం చేస్తూ ఉగ్రవాదం వైపు ఆకర్షితుడయ్యాడని నిఘా వర్గాలు డిల్లీ హైకోర్టుకి తెలియజేసాయి. అతనిలో నేర ప్రవృతి పెరిగినట్లు కేంద్రప్రభుత్వం కూడా దృవీకరించి, అతని శిక్షను మరికొంత కాలం పొడిగించమని హైకోర్టుని కోరింది. అటువంటి నేర ప్రవృతి ఉన్నవ్యక్తిని సంస్కరించకుండా సమాజంలోకి పంపినట్లయితే అతని వలన సమాజానికి ఇంకా తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉంది కనుక అతనిని విడుదల చేయవద్దని కోరుతూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా పిటిషన్ వేశారు. నిర్భయ (జ్యోతీ సింగ్) తల్లి తండ్రులు కూడా అతనిని విడుదల చేయవద్దని కోర్టుని, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని అభ్యర్ధించారు.

సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ పై ఈరోజు విచారణ చేపట్టిన డిల్లీ హైకోర్టు, బాలనేరస్తుడి శిక్షను ఇంకా పొడిగించలేమని తీర్పు ప్రకటించింది. కనుక అతను ఎల్లుండి అంటే ఆదివారంనాడు బాల నేరస్తుల గృహం నుండి విడుదలకు లైన్ క్లియర్ అయినట్లే భావించవచ్చును. నిర్భయ తల్లి, తండ్రులు, పలు ప్రజా సంఘాలు కోర్టు తీర్పును వ్యతిరేకిస్తున్నాయి. డిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఎవరయినా సుప్రీం కోర్టులో పిటిషన్ వేస్తే తప్ప అతనిని ఇంకా నిర్బంధించడం సాధ్యం కాకపోవచ్చును. 16-18సం.ల వయసు గల అటువంటి నేరస్తులని పెద్దవారితో సమానంగా శిక్షించేందుకు కేంద్రప్రభుత్వం బాల నేరస్తుల చట్టంలో సవరణలు చేసి పార్లమెంటులో ప్రవేశపెట్టింది. మోడీ ప్రభుత్వానికి లోక్ సభలో మెజార్టీ ఉంది కనుక దానిని ఆమోదించగలిగింది. కానీ రాజ్యసభలో తగినంత బలం లేకపోవడం, కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక అంశం భుజానికెత్తుకొని సభను స్తంభింపజేస్తుండటంతో ఆ చట్టం ఇంకా ఆమోదానికి నోచుకోలేదు. ఇప్పుడు హైకోర్టు అతని విడుదలకు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో అంత తీవ్రమయిన, హేయమయిన నేరం చేసినప్పటికీ అతను చిన్నపాటి శిక్షతో తప్పించుకోగలుగుతున్నాడు. మిగిలిన వారికి కోర్టు మరణదండన విధించింది. కానీ దానిపై కూడా సుప్రీం కోర్టులో కేసులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close