ప్రముఖ నటుడు రంగనాద్ ఆకస్మిక మృతి

ప్రముఖ తెలుగు సినీ నటుడు రంగనాద్ (70) శనివారం మరణించారు. సికిందరాబాద్ లోని కవాడీగూడా అనే ప్రాంతంలో గల ఆయన స్వగృహంలో అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు కనుగొన్నారు. ఆయన ఎంతో అమితంగా ప్రేమించే భార్య కొన్ని నెలల క్రిందటే అనారోగ్యంతో చనిపోయారు. అప్పటి నుండి ఆయన తీవ్రమానిస్క వేదన అనుభవిస్తున్నట్లు, జీవితంపై విరక్తితో మాట్లాడుతున్నట్లుగా ఆయన సన్నిహితులు చెపుతున్నారు. కనుక ఆ బాధతోనే ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చనే అనుమానంతో బందువులు పోలీసులకు పిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.

రంగనాథ్ పూర్తి పేరు తిరుమల సుందర శ్రీ రంగనాద్. ఆయన 1949లో చెన్నైలో జన్మించారు. ఆయన తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో బీఏ చేసారు. కొన్ని సం.లు రైల్వేలో టికెట్ కలెక్టర్ గా పనిచేసారు. ఆయన 1969లో తన మొట్ట మొదటి సినిమా బుధ్దిమంతుడుతో సినీరంగ ప్రవేశం చేసారు. అప్పటి నుండి సుమారు 300కి పైగా సినిమాలలో ఆయన విభిన్న పాత్రలలో నటించి ప్రజలను మెప్పించారు. 1977లో విడుదలయిన పంతులమ్మ సినిమా ఆయనకి గొప్పపేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టింది. దేవతలారా దీవించండి, తాయారమ్మ బంగారయ్య, ఇంటింటి రామాయణం, మావూరి దేవత, ఈ చరిత్ర ఏ సిరాతో, విశ్వనాధ నాయకుడు వంటి అనేక సినిమా పేర్లు చెప్పగానే అందులో ఆయనే గుర్తుకు వస్తారు. మొగుడ్స్‌-పెళ్లామ్స్‌ సినిమాకు ఆయన దర్శకత్వం వహించారు. శాంతి నివాసం, ఇద్దరు అమ్మాయిలు అత్తో అత్తమ్మ కూతురో తెలుగు టెలీ సీరియల్స్ కూడా నటించారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close