మోహన్‌బాబును గేదెతో పోల్చిన దర్శకుడు

హైదరాబాద్: విలక్షణ నటుడు మోహన్‌బాబు అంటే టాలీవుడ్‌లో అందరికీ హడలేనన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటి మోహన్‌బాబునే గేదె అని సంబోధించారు సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ. ఇటీవల ఒక వీడియో ఇంటర్వ్యూలో ఆహార అలవాట్ల గురించి వర్మ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మోహన్ బాబు ఆహార అలవాట్ల గురించి ప్రస్తావించారు. మోహన్ బాబుతో షూటింగ్‌లో ఉన్నపుడు ఆయన ఏదో ఒక ఆహారపదార్థాన్ని ఆఫర్ చేస్తూనే ఉంటారని అన్నారు. ఒకసారి ఆమ్లెట్ అని, ఒకసారి స్వీట్ అని, మరోసారి బిర్యాని అని ఏదో ఒకటి ఆఫర్ చేస్తుంటారని, వాటిని గురించి వర్ణిస్తూ ఉంటారని చెప్పారు. ప్రతి 15-20 నిమిషాలకొకసారి ఏదో ఒకటి పెడుతూ ఉంటారని అన్నారు. ఒకరోజు తాను, “గేదెలు, మేకలు ఎప్పుడూ తింటూ ఉంటాయండి, సింహం ఒకేసారి తింటుందండి” అని చెప్పినట్లు తెలిపారు. ఆ మాటలతో ఆయన షాక్ అయ్యారని చెప్పారు. “నేను ఎప్పుడూ నిలబడే ఉంటాను, మీరు ఎప్పుడూ కూర్చునే ఉంటారు, నాకు ఎప్పుడూ అలసటగానీ, అనారోగ్యంగానీ ఉండవు, మీకు మాత్రం అవన్నీ ఉంటాయి” అని అన్నట్లు వెల్లడించారు. “మీరు గేదెలాగా ఎప్పుడూ తింటూ ఉండటం వల్లే ఇలా జరుగుతోంది” అని చెప్పినట్లు తెలిపారు. రుచికోసం తినగూడదని, అది ఆల్కహాల్ కంటే కూడా చాలా దారుణమైన అలవాటని చెప్పారు. జీవించటంకోసం తినాలి తప్పితే తినటంకోసం తినగూడదని వర్మ అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close