అత్యాచార వార్త‌ను ఇంకా ఇలానే రాస్తారా..?

‘ఆరేళ్ల చిన్నారిపై టీడీపీ కార్య‌క‌ర్త అత్యాచారం’.. ఇదీ ఈ రోజు సాక్షి దిన‌ప‌త్రిక‌లో క‌నిపించిన ఒక వార్త‌! క‌ర్నూలు జిల్లాలో ఒక అత్యాచార ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిపై వ‌ర్కూరు గ్రామంలో ఒక పెద్దాయ‌న అత్యాచారం చేశాడు. అనంత‌రం బాధితురాలి కుటుంబ స‌భ్యుడు కొడుమూరు పోలీస్ స్టేష‌న్ లో కేసు పెట్టారు. అత్యాచారం చేసిన వ్య‌క్తి టీడీపీ కార్య‌క‌ర్త అని, త‌మ ప్ర‌భుత్వం అధికారంలో ఉంద‌నీ, దీని గురించి ఎవ‌రికైనా చెబితే జాగ్ర‌త్త అంటూ బెదిరించినట్టు ఆ వార్త‌లో రాశారు.

అత్యాచార ఘ‌ట‌న‌లకు కూడా రాజ‌కీయ కోణాల ఆపాదింపు ఏ స్థాయికి దిగజారిందో దాచేప‌ల్లిలో చోటు చేసుకున్న ప‌రిణామాల‌ను చూసి వార‌మైనా కాలేదు. సుబ్బ‌య్య టీడీపీ కార్య‌క‌ర్తేననీ, లేదూ.. వారి బంధువులంతా వైకాపాలోనే ఉన్నారంటూ అధికార ప్ర‌తిప‌క్ష పార్టీలు దుమ్మెత్తిపోసుకున్న వైనం చూశాం. అత్యాచార కేసుల విష‌యంలో కూడా వీరికి సానుభూతి ఉండ‌దా, ఇక్క‌డా రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలేనా అంటూ సామాన్యులు మండిప‌డ్డారు. ఇంత జ‌రిగాక కూడా.. ఇప్పుడు సాక్షి ప‌త్రిక ‘టీడీపీ కార్య‌క‌ర్త అత్యాచారం’ అంటూ వార్త రాసింది. ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డుతున్న‌వారంతా తెలుగుదేశం పార్టీకి చెందిన‌వారే అనే వాద‌నను వైకాపా తెర‌మీదికి తీసుకొచ్చింది. కాబ‌ట్టి, ఇక‌పై ఏ అత్యాచారం ఘ‌ట‌న జ‌రిగినా, పార్టీ స‌భ్య‌త్వ ర‌సీదులు, అధికార పార్టీ నుంచి పొందిన ప్ర‌యోజ‌నాలు, స‌ద‌రు నిందితుడు ప్ర‌భుత్వం క‌ల్పించిన సంక్షేమ‌ ప‌థ‌కాల‌ను వినియోగించుకున్నాడా లేదా అనేవి వెలికి తీసే ప్ర‌య‌త్నంలో ఆ పార్టీ ప‌త్రిక ఉన్న‌ట్టుంది.

అత్యాచారం మాత్ర‌మే కాదు… దోపిడీలు, దొంగ‌త‌నాలు, హ‌త్య‌లు చేసిన‌వాళ్లు కూడా ఏదో ఒక పార్టీకి చెందిన‌వారే అయ్యుంటారు క‌దా! అంటే, అలాంటి వారి వికార‌పు చేష్ఠ‌ల‌ను ఏదో ఒక రాజ‌కీయ‌ పార్టీ ప్రేరేపిత చ‌ర్య‌గానే సాక్షి చూస్తుందేమో..? కేంద్రం అంద‌రికీ ఆధార్ కార్డులు ఇచ్చింది క‌దా, ఆ లెక్క‌న ఆధార్ ఉన్న‌వాడు ఎవ‌డైనా ఇలాంటి ప‌ని చేస్తే.. అది కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రేరేపించిన దుశ్చ‌ర్య‌గా ఇక‌పై మాట్లాడుకోవాలా.? బాధ్య‌త‌గ‌ల మీడియాగా ఇలాంటి క‌థ‌నాలు రాసేటప్పుడు.. రాజ‌కీయ కోణాల‌ను ప‌క్క‌నపెట్టి, మాన‌వ‌తా దృక్ప‌థంతో ఆలోచించాలి. క‌నీసం ఇలాంటి దారుణ‌మైన సంఘ‌ట‌న క‌థ‌నాల్లో రాజ‌కీయ కోణాలు త‌గ్గించాలి. ‘నిందితుడు టీడీపీకి చెందివాడని బాధితులు చెప్పారు కాబట్టి రాశాం’ అని వాదించొచ్చు. వైకాపా కార్యకర్త అని చెప్పినా కూడా రాసే ధైర్యం సాక్షి ఉంద‌ని వారు వాదించొచ్చు. కానీ, ఇలాంటి క‌థ‌నాల్లో రాజ‌కీయ పార్టీల ప్ర‌స్థావ‌న‌ను సంస్క‌రించాల్సిన బాధ్య‌త ప‌త్రిక‌కు ఉండాలి క‌దా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

చిరుని రెచ్చ‌గొడితే వైకాపాకే న‌ష్టం!

చిరంజీవి మీద వైకాపాకు మ‌ళ్లీ కోపం వ‌చ్చింది. మొన్న‌టికి మొన్న జ‌న‌సేన‌కు రూ.5 కోట్లు ఇచ్చినందుకు చిరుని టార్గెట్ చేశారు. ఇప్పుడు `పిఠాపురంలో ప‌వ‌న్‌కు ఓటేయ్యండి` అన్నందుకు చిరుపై నోళ్లేసుకుని ప‌డిపోతున్నారు. మెగా...

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ఎత్తివేసిన క్యాట్

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించింది. ఆయనపై రెండో సారి విధించిన సస్పెన్షన్ చట్ట విరుద్ధమని క్యాట్ తీర్పు చెప్పింది. టీడీపీ హయాంలో ఇంటలిజెన్స్ చీఫ్ గా పని చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close