మే 26న జగన్ ప్రమాణ స్వీకారం..! ముహుర్తం ఫిక్స్ చేసిన వైసీపీ..!

ఏప్రిల్ పదకొండో తేదీన పోలింగ్ ముగిసినప్పటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమదే ప్రభుత్వమన్న నమ్మకంతో ఉంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రశాంత్ కిషోర్… కంగ్రాట్స్ చెప్పి.. సీఎం జగన్మోహన్ రెడ్డి అనే నేమ్ ప్లేట్ కూడా తయారు చేయించి ఇచ్చి వెళ్లారు. ఇప్పుడు.. వైసీపీ నేతలు మరింత ముందడుగు వేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మే ఇరవై ఆరో తేదీన ప్రమాణస్వీకారం చేయబోతున్నట్లుగా ప్రకటించారు. హైదరాబాద్‌లోని వైసీపీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన చంద్రబాబు… జూన్ ఎనిమిదో తేదీ వరకూ తానే ముఖ్యమంత్రినని చెప్పడాన్ని తప్పుపట్టారు. ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కాయంగా కాబట్టి… ఫలితాలు వచ్చిన వెంటనే.. ఇరవై ఆరోతేదీన జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని.. అలాంటప్పుడు.. జూన్ ఎనిమిదో తేదీ వరకూ…చంద్రబాబు ఎలా సీఎంగా ఉంటారని ప్రశ్నించారు.

సజ్జల రామకృష్ణారెడ్డి.. జగన్ కోటరీలో అత్యంత ముఖ్యుడు కాబట్టి.. ఈ విషయంలో.. వైసీపీలో చర్చ జరిగిన తర్వాతే నిర్ణయం తీసుకుని ఉంటారని మీడియా వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై కూడా చర్చ జరిగిందని… బయట ప్రచారం జరుగుతోంది. దీనిపై.. వైసీపీ నేతలు ఎక్కడా బహిరంగంగా మాట్లాడటం లేదు. అయితే.. ఎన్నికల్లో పోటీ చేసిన కొంత మంది సీనియర్ నేతలు మాత్రం… తమకు కీలక శాఖ దక్కుతుందని అనుచరులతో చెప్పి సంబర పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి.. పోలింగ్ రోజు మీడియాతో మాట్లాడినప్పుడు… గెలుపు, ప్రమాణస్వీకారంపై పెద్దగా మాట్లాడలేదు.

గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన తర్వాత మీడియా ప్రతినిధులు ప్రమాణస్వీకారం ఎప్పుడు చేస్తారని ప్రశ్నించినప్పుడు.. అంతా దేవుడి దయ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు మాత్రం తేదీ కూడా ఫిక్స్ చేసుకున్నారు. మరో నెల రోజులు ఉంది కాబట్టి.. జగన్ విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత కేబినెట్‌ను కూడా డిసైడ్ చేసుకుంటారన్న ప్రచారం వైసీపీలో జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close