వైసీపీతో బీజేపీ నేతల సంప్రదింపులు..! మరి కేసీఆర్..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి… జాతీయ రాజకీయాల్లో ఇప్పటి వరకూ నిమిత్తమాత్రుడు. ఆయనకు సీట్లు వస్తాయని ఎవరూ అనుకోలేదేమో కనీ.. ఆయనతో టచ్‌లోకి రావాలని .. ఎవరూ అనుకోలేదు. ఒక్క టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రమే… ఆయనతో టచ్‌లోకి వెళ్లారు. జగన్ అడిగిన సాయమల్లా చేశారు, కేసీఆర్ చేసిన సాయానికి కృతజ్ఞతగా.. కేసీఆర్‌తో కలిస్తే తప్పేమిటని.. జగన్ కూడా బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దాంతో… బాండింగ్ కుదిరినట్లయింది.

విజయసాయి దగ్గర మాట తీసుకున్న బీజేపీ..!

అయితే.. ఇప్పుడు పోలింగ్ మారింది. కౌంటింగ్ దగ్గర పడింది. అలాగే రాజకీయాలు కూడా మారిపోయాయి. భారతీయ జనతా పార్టీ… .. వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చలు ప్రారంభించింది. ఈ మేరకు.. కొంత మంది బీజేపీ అగ్రనేతలు విజయసాయిరెడ్డితో మాట్లాడారని చెబుతున్నారు. నిజానికి విజయసాయిరెడ్డి.. బీజేపీకి చాలా… అంటే చాలా దగ్గరగా ఉంటున్నారు. ఎంతగా ్ంటే.. ఆయన ఫలానా వారిపై విచారణ చేయాలని లేఖ రాస్తే.. పీఎంవో.. గంటల్లోనే స్పందిస్తుంది. అంత పలుకుబడి విజయసాయిరెడ్డికి.. పీఎంవో ఇచ్చింది. మరి అలాంటప్పుడు.. తమతో రాకుండా ఎలా ఉంటారని బీజేపీ అనుకుంటోంది. వైసీపీ ఆలోచన కూడా మొదటి నుంచి అదే. కానీ కొన్ని రిజర్వేషన్లు వైసీపీకి ఉన్నాయి.

టీఆర్ఎస్‌కు వైసీపీ దూరం అవుతున్నట్లే..!

కేసీఆర్ ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌లో… నమ్మకంగా ఇప్పటికి ఉంటారని భావిస్తున్న ఒకే ఒక్క నేత.. పార్టీ వైసీపీనే. అలాంటిది.. ఒక్క సారిగా.. బీజేపీ నేరుగా.. జగన్ తో టచ్‌లోకి వెళ్లడం.. కేసీఆర్ శిబిరాన్ని కలవర పరుస్తోంది. ఆ ఒక్క నేత కూడా దూరం అయితే.. టీఆర్ఎస్‌కు రాజకీయంగా విలువ లేకుండా పోతుంది. ఎందుకంటే.. ఇప్పటి వరకూ కేసీఆర్ ఎక్కడకు వెళ్లినా.. టీఆర్ఎస్‌కు… వైసీపీ కలిసి వచ్చే సీట్ల గురించే చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 42 సీట్లలో కనీసం 30 తమ ఖాతాలో ఉంటాయని చెప్పుకొస్తున్నారు. ఇలాంటి సమయంలో… వైసీపీ విడి అయిపోయే.. తన ప్రాబల్యం మరింత తగ్గిపోతుందని.. కేసీఆర్ ఆందోళన కావొచ్చు. కానీ.. జగన్మోహన్ రెడ్డికి కేసీఆర్ కన్నా బీజేపీనే ముఖ్యం మరి..!

ఎవరు కేంద్రంలో అధికారంలో ఉంటే వారికి మద్దతివ్వక తప్పని పరిస్థితి వైసీపీది..!

జాతీయ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒకే ఒక్క ఆసక్తి ప్రత్యేకహోదా. అది ఏపీకి ప్రత్యేకహోదా కాదు. తనకు కేసుల్లేని హోదా. అందుకు ఆయన తప్పని సరిగా.. కేంద్రంలో అధికారంలోకి వ్చచే పార్టీకి మద్దతు ప్రకటించాలి. లేదంటే.. ఆయన జైలుకెళ్లిపోతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. రేపు కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమో… కాంగ్రెస్ మద్దతుతో.. ప్రాంతీయ పార్టీల కూటమో అధికారంలోకి వస్తే… జగన్ ఆ పార్టీ లేదా కూటమి వైపు వెళ్లక తప్పదు. అందులో టీడీపీ కీలకంగా ఉన్నా సరే తప్పదు. ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి నేరుగా మద్దతు ప్రకటించినట్లుగానే.. రాజకీయం చేయక తప్పదు. ఇది కూడా.. కేసీఆర్ కు ఇబ్బంది కలిగించేదే..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

తెలంగాణలో కనిపించని ఎన్నికల హడావుడి – ఖర్చు భయమే !

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మీడియాలో తప్ప క్షేత్ర స్థాయిలో ఎక్కడా ఎన్నికల ప్రచార హడావుడి కనిపించడం లేదు. అన్ని ప్రధాన పార్టీలు ఇంకా ప్రచారాన్ని ఉద్ధృతం చేయలేదు. మరో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close