ఏపీ సర్కార్‌పై అన్నంత పని చేసిన విద్యుత్ సంస్థలు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై విద్యుత్ సంస్థలు కోర్టుకెక్కాయి. ఏపీ ప్రభుత్వంలో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు కుదుర్చుకున్న దాదాపు 40 విద్యుత్ సంస్థలు.. హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పీపీఏల సమీక్ష కోసం.. ఏపీ సర్కార్ ప్రత్యేకంగా ఉన్నత స్థాయి కమిటీని నియమించడాన్ని.. ఈ సంస్థలు.. పిటిషన్‌లో ఆక్షేపించాయి. దానికి సంబంధించి విడుదల చేసిన జీవో చట్ట విరుద్ధమని.. దాన్ని కొట్టి వేయాలని .. పిటిషన్లలో కోరాయి. మొత్తం 14 పిటిషన్లు దాఖలైనట్లు సమాచారం. విద్యుత్ ఒప్పందాల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ… ఆ ఒప్పందాలను సమీక్ష చేసేందుకు ఉన్నత స్థాయి కమిటీని ఏపీ ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ ఏం చేయాలో వివరిస్తూ జీవో కూడా జారీ చేసింది. దీనిపైనే విద్యుత్ సంస్థలు పోరాటం ప్రారంభించాయి.

నిజానికి పీపీఏల విషయం రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారశైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. రెండు సార్లు కేంద్రం హెచ్చరిక లేఖలు పంపినప్పటికి.. రాష్ట్ర ప్రభుత్వం లెక్క చేయలేదు. అంతే కాదు.. సమీక్ష జరిపి.. తీరుతామని ప్రకటించింది. ఆ మేరకు విద్యుత్ కంపెనీలన్నింటికీ.. సమీక్షలకు రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇలా మొదట్లో వచ్చిన ఒకటి, రెండు కంపెనీల ప్రతినిధులను.. ధరలు తగ్గించాల్సిందేనని ఒత్తిడి తేవడంతో.. వారు నిరాకరించి. పవర్ ట్రిబ్యునల్‌లో పిటిషన్ వేశారు. దీంతో.. పవర్ ట్రిబ్యునల్.. స్టే విధించింది. ఈ సారి అన్ని కంపెనీలు.. మాట్లాడుకుని.. నేరుగా హైకోర్టుకు వచ్చేశాయి. అన్ని కంపెనీలు కలిసి.. పధ్నాలుగు పిటిషన్లు దాఖలు చేసి.. ఏపీ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందని వాదించడం ప్రారంభించాయి.

నిజానికి పీపీఏల విషయంలో… ఏపీ సర్కార్ వైఖరిని ఒక్క విద్యుత్ రంగ నిపుణుడు కూడా సమర్థించని పరిస్థితి ఉంది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు కూడా… ఈ చర్యలపై ఆందోళన వ్యక్తం చేశాయి. అయినా కానీ ఏపీ సర్కార్ ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ధరలు తగ్గించకపోతే… ఒప్పందాలు రద్దు చేస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో.. ఒప్పందాలు రద్దు చేస్తే.. తమ కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయన్న అంచనాతో.. ముందుగానే.. విద్యుత్ సంస్థల యజమానాలు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఏపీ సర్కార్ కు ఇది.. తీర్చుకోలేని చిక్కుముడిగా మారుతోందన్న అభిప్రాయం ఏర్పడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close