చలో దొనకొండ..! భూములు కొనేస్తున్నారట..!

ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ.. ఇలా రాజధాని నిర్మాణం గురించి పునరాలోచిస్తున్నామని ప్రకటించగానే.. అలా…. దొనకొండ వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పరుగులు ప్రారంభించారట. నిజానికి వైసీపీ వచ్చినప్పటి నుండి.. రాజధానిని మారుస్తారనే ప్రచారం ఉన్నప్పటికీ… అమరావతిని మార్చడం అంత తేలిక కాదనే చర్చ జరిగింది. అందుకే.. కొంత మంది.. వేచి చూస్తున్నారు. కానీ.. ఇప్పుడు… మంత్రి బొత్స ప్రకటన.. విజయసాయిరెడ్డి కూడా.. ముంపు గురించి మాట్లాడుతూండటంతో.. ఓ ప్రణాళిక ప్రకారమే వైసీపీ నేతలు.. ఈ వివాదం రేపారని.. అంతిమంగా.. రాజధాని మార్పుతోనే.. ఈ వ్యవహారం.. ముగుస్తుందని.. నమ్ముతున్నారు. అందుకే.. దొనకొండ దగ్గర భూముల కొనుగోలుకు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పరుగులు పెడుతున్నారని అంటున్నారు.

దొనకొండ దగ్గర కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉంది. అందులో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకారం.. రాజధానికి కావాల్సిన సెక్రటేరియట్, అసెంబ్లీ, రాజ్ భవన్… ఇతర నిర్మాణాలు పూర్తి చేయవచ్చు. రాజధానిని మార్చేయవచ్చు. ఖర్చేమీ ఉండదు. ఆ పని చేయడానికే ఎక్కువ అవకాశం ఉందని.. వైసీపీ నేతలు… ఆ పార్టీతో సన్నిహితంగా ఉండే.. వ్యాపారులు నమ్ముతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మంది… ఇప్పుడు.. అనేక మంది.. భూముల లావాదేవీల కోసం… దొనకొండ వైపు చూస్తున్నారు.

కొద్ది రోజులుగా .. దొనకొండలో భూముల కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీలు.. అనూహ్యంగా పెరిగిపోయాయని…వైసీపీకి సన్నిహితంగా ఉండే కొంత మంది వందల ఎకరాల్లోనే కొనుగోలు చేస్తున్నారని… ఆంధ్రజ్యోతి దినపత్రిక బయట పెట్టింది. రాయలసీమ నుంచి… కొంత మంది నేతలు.. ప్రస్తుతం దొనకొండ..ఆ పరిసర ప్రాంతాల్లో మకాం వేశారని అంటున్నారు. మొత్తానికి.. నిర్ణయం తీసుకోని దానిపై చర్చ అనవసరమని.. విజయసాయిరెడ్డి లాంటి నేతలు చెబుతూ ఉన్నా… ఆ పార్టీ నేతలు.. మాత్రం.. నిర్ణయం అయిపోయిందని.. ఎలా.. లాభం చేసుకోవాలా.. అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. భూములు కొనేందుకు… సిద్ధమవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close