బొత్స మాట..! రాజధాని రైతుల బాధ కౌలు కోసమట..!

కౌలు కోసమే రాజధానికి భూములిచ్చిన రైతులు రోడ్డెక్కుతున్నారని.. మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. రాజధాని రైతుల్ని ఆయన అత్యంత హీనంగా చూస్తూ… వ్యాఖ్యలు చేస్తూండటంతో.. ఇదే మొదటి సారి కాదు. బొత్స ప్రకటనలపై..రాజధాని రైతులు రగిలిపోతున్నారు. కౌలు పది రోజుల్లో చెల్లిస్తామని.. బొత్స.. గొప్పగా ప్రకటిస్తూండటం… రైతుల్ని మరింత ఆగ్రహానికి గురి చేస్తోంది. అమరావతిపై.. వరుసగా వివాదాస్పద ప్రకటనలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న బొత్స.. రోజు రోజుకు వాటి డోస్ పెంచుకుంటూ పోతున్నారు. ఒకే సామాజికవర్గం వారిదన్నట్లుగా ప్రచారం చేయడం కూడా … రైతులకు నచ్చడం లేదు. రాజధానిలో మొత్తం 16 కులాలకు చెందిన వారు భూములిచ్చిన విషయాన్ని రైతులు గుర్తుచేస్తున్నారు. ఒకే సామాజికవర్గం వారు ఉన్నారని విష ప్రచారం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

రాజధాని రైతుల ఆందోళనకు అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. ఆదివారం సీపీఐ నేతలు పర్యటించారు. సోమవారం రాజధాని రైతులు, కూలీలు ఏపీ బీజేపీ అధ్యక్షుడ్ని కలిశారు. మంగళవారం బీజేపీ నేతలు రాజధానిలో పర్యటించబోతున్నారు. 30, 31 తేదీల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. పార్టీల మద్దతు లభిస్తూ ఉండటంతో రైతులు ఆందోళనకు సమాయత్తమవుతున్నారు. రాజకీయ పార్టీల పర్యటనల తర్వాత రాజధానిపై ఉద్యమానికి రైతాంగం ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే రోడ్డెక్కటం ఖాయమని రాజధాని రైతులు చెబుతున్నారు.

బొత్స సత్యనారాయణ బెదిరింపు తరహాలో మాట్లాడుతూండటంతో.. వివాదం మరింత ముదురుతోంది. రాజధానిలో ఎవరెవరికి భూములున్నాయో సవాల్ చేస్తే నిరూపిస్తామని బొత్స వ్యాఖ్యానించారు. ఇన్ సైడ్ ట్రేడింగ్ జరిగిందని చెప్పుకొచ్చారు. కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు తనకు సెంటు భూమిలేదని చెప్పారని… ఆయన సవాల్ చేస్తే.. ఆయనకు ఎంత భూమి ఉందో బయటపెడతామని బొత్స చెప్పుకొచ్చారు. నిజానికి సుజనా చౌదరి.. తనకు వారసత్వం వచ్చిన ఆస్తులు తప్ప… 2010 తర్వాత ఎప్పుడైనా భూములు కొనుగోళ్లు చేసినట్లు నిరూపిస్తే.. ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్ చేశారు. అయితే.. బొత్స.. సవాల్ చేస్తే చూపిస్తామని.. వ్యాఖ్యానించారు. నిజంగా ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఉంటే… మూడు నెలల కాలంలో… చిట్టా బయటకు రాకుండా ఉంటుందా..? అనేది చాలా మందికి అర్థం కాని విషయం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కూటమికి బీజేపీ సహకారం ఇంతేనా !?

ఏపీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ వ్యవహారం ఎప్పటికప్పుడు చర్చనీయాంశం అవుతోంది. భారతీయ జనతా పార్టీకి ఏపీలో ఆరు లోక్ సభ సీట్లు, పది అసెంబ్లీ సీట్లు కేటాయించారని ప్రకటించినప్పడు రాజకీయవర్గాలు...

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close