భారత్‌ను రెచ్చగొడుతున్న చైనా !

భారత్‌ను చైనా కావాలనే కవ్విస్తోంది. అవసరం లేకపోయినా.. సరిహద్దుల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరిస్తోంది. భారత సైన్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. సరిహద్దుల్లో పరిస్థితి అంతకంతకూ ఉద్రిక్తతంగా మారుతోంది. యుద్ధం ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు పంపుతున్నట్లుగా చైనా బలగాలను.. ఆయుధాలను తీసుకొచ్చి భారత్‌వైపు గురి పెట్టింది. అయితే… భారత ప్రభుత్వం మాత్రం.. చాలా కూల్‌గా ఉంది. సరిహద్దులో చైనా భారీ స్థాయిలో బలగాలు మోహరించిన మాట వాస్తవమేనని.. అలా ఎందుకు చేశారో ఇప్పుడు మాట్లాడటం సరికాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ తేల్చేశారు. చైనాతో చర్చలు చర్చలు సాగుతున్నాయని.. సానుకూల వాతావరణం నెలకొంటుందని ఆశిస్తున్నామని ప్రకటించారు.

చైనా అరుణాచల్ ప్రదేశ్ తమదేనని చాలా కాలంగా వాదిస్తోంది. భారత్‌లోని కొన్ని ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. వివాదాల్లోకి లాగే ప్రయత్నం చేస్తోంది. నేపాల్‌ను కూడా భారత్‌పైకి దువ్వుతోంది. చైనా దన్నుతో నేపాల్..భారత్‌లోని భూభాగాలను కలిపేసుకుని కొత్త మ్యాప్ రూపొందించుకుని రాజ్యాంగాన్ని కూడా సవరిస్తోంది. ఇదంతా అందరికీ తెలిసినా.. భారత ప్రభుత్వం మాత్రం.. చైనాకు ధీటుగా సమాధానం చెప్పకుండా.. చర్చలు జరుగుతున్నాయని చెప్పుకొస్తోంది. అదే పాకిస్థాన్ వైపు నుంచి ఇలాంటివి జరిగితే మాత్రం.. బీజేపీ నేతలు.. కేంద్ర పెద్దల స్పందన మరో రకంగా ఉండేది. సరిహద్దుల్లో పోరాటం సంగతి వేరే.. కానీ..పాకిస్థాన్‌ దుశ్చర్యలను ప్రచారం చేసి దేశ ప్రజల్లో భావోద్వేగం నింపడానికి మాత్రం… భారీ ప్రకటనలు వెలువడి ఉండేవి. కానీ చైనా విషయంలో మాత్రం… అంత దూకుడుగా ఉండటం లేదు.

కరోనా దెబ్బకు మొదట్లో చైనా ఇబ్బంది పడింది. కానీ ఇప్పుడు పూర్తిగా కోలుకుంది. భారత్ మాత్రం ఇంకా వైరస్ పై పోరాడుతూనే ఉంది. రెండు నెలల లాక్ డౌన్ కారణంగా.. ఆర్థిక ఇబ్బందుల్లో కూడా పడింది. భారత్ పరిస్థితిని ఆసరా చేసుకుని.. చైనా ఇలా.. దూకుడుగా వ్యవహరిస్తోందని అంటున్నారు. భారత్ ఘాటుగా సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తే.. అది దేశంలోని పెట్టుబడులపై ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చైనాలోని అనేక కంపెనీలు.. అనుకూలమైన ప్రాంతం ఇండియా అని.. అక్కడకు ప్లాంట్లు మార్చడానికి ప్రయత్నిస్తున్నాయని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్ని మార్చడానికే చైనా సరిహద్దుల్లో అలజడి రేపుతోందని తెలుస్తోంది. అయితే దానికి తగ్గ వ్యూహం.. కేంద్రం అమలు చేస్తోందా లేదా అన్నదే చాలా మందికి వస్తున్న సందేహం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫ్లాష్ బ్యాక్‌: క్రెడిట్ తీసుకోవడానికి భయపడ్డ త్రివిక్రమ్

ఇప్పుడు పరిస్థితి మారింది కానీ ఒకప్పుడు రచయిత అనే ముద్ర పడిన తర్వాత ఇక దర్శకుడయ్యే అవకాశాలు పూర్తిగా తగ్గిపోతాయి. రైటర్ గానే కెరీర్ ముగిసిపోతుంది. అందుకే అప్పట్లో దర్శకుడు కావాలని వచ్చిన...

టెట్ నిర్వహణపై సస్పెన్స్

తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) పై సస్పెన్స్ నెలకొంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెట్ పరీక్షను వాయిదా వేస్తారా..?షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తారా..?అని అభ్యర్థులు స్పష్టత కోసం ఎదురుచూస్తున్నారు. టెట్ పరీక్షల...

సుకుమార్.. మీరు సూప‌రెహె..!

ఇండస్ట్రీలో డబ్బులు తేలిగ్గా ఇస్తారేమో కానీ క్రెడిట్లు ఇవ్వరు. ముఖ్యంగా రచయితలు ఈ విషయంలో అన్యాయమైపొతుంటారు. ఓ రైటర్ తో ట్రీట్మెంట్, డైలాగ్స్, స్క్రీన్ ప్లే.. ఇలా అన్నీ రాయించి, చివరికి ఆ...

జూన్ 27న ‘క‌ల్కి’

ప్ర‌భాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'క‌ల్కి' రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌చ్చేసింది. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయాల‌ని చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. దీనిపై అతి త్వ‌ర‌లోనే నిర్మాత‌లు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close