ఏపీ ఉద్యోగులకు జీతాల్లేవ్..! కారణం ఎవరు..?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఈ నెల జీతాలు ఇంకా అందలేదు. మరో నాలుగైదు రోజులు అందుతాయనే గ్యారంటీ లేదు. ఒక్క జీతాలే కాదు..మరో మూడు నాలుగు రోజుల పాటు.. ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం తరపున చెల్లింపులు జరగవు. దీనికి కారణం ఖజానాలో డబ్బుల్లేకపోవడం కాదు… మంజూరు చేసే అధికారం ప్రభుత్వానికి లేకపోవడం. ఈ అసాధారణమైన పరిస్థితిని ప్రభుత్వమే చేజేతులా కొని తెచ్చుకుంది. శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందకపోవడంతో.. ఈ పరిస్థితి తలెత్తింది.

సహజంగా.. బడ్జెట్‌ను ఫిబ్రవరి లేదా మార్చిలో ప్రవేశ పెట్టి ప్రభుత్వాలు శాసనసభ.. మండలిలో ఆమోదింప చేసుకుంటాయి. కానీ వివిధ కారణాల వల్ల ఏపీ సర్కార్ ఆ పని చేయలేకపోయింది. బడ్దెట్ పెట్టలేకపోవడంతో…మొదటి నాలుగు నెలలకు ఓటాన్ అకౌంట్ ద్వారా గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ తెప్పించుకుని బండి నడిపించింది. మొన్న అసెంబ్లీ సమావేశాలు పెట్టి బడ్జెట్ ఆమోదింప చేసుకుంది. కానీ శాసనమండలిలో కూడా ఆమోదం పొందితేనే గవర్నర్ సంతకం పెడతారు. అక్కడ ఆ బిల్లు పెట్టమని టీడీపీ సభ్యులు చెప్పినా.. రాజధాని తరలింపు బిల్లులు పెట్టడం… ఎమ్మెల్సీలు కొట్టుకోవడంతో సభ నిరవధికంగా వాయిదా పడింది. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందలేదు. పధ్నాలుగు రోజుల తర్వాత బిల్లు ఆటోమేటిక్‌గా ఆమోదం పొందుతుంది.

30వ తేదీతో 14 రోజులు అయిపోయాయి. ఆమోదం పొందినట్లుగానే భావించి గవర్నర్ వద్దకు ఫైల్ పంపాల్సిన ప్రభుత్వం పంపలేదు. దీంతో.. జీతాలు ఆలస్యమయ్యాయి. శనివారం తర్వాతే జీతాలొస్తాయని ప్రభుత్వం ఉద్యోగులకు చెబుతోంది. పనిలో పనిగా.. టీడీపీ వల్లే ఆలస్యం అయ్యాయని చెబుతోంది. సమయానికి జీతాలివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. ఆలస్యం అయితే.. ప్రభుత్వాన్నే అంటారు … కానీ ప్రతిపక్షాన్ని ఎవరూ ఏమీ అనలేరు. అయితే.. ప్రభుత్వం మాత్రం.. టీడీపీపైనే ఎదురుదాడికి దిగుతోంది. ఉద్యోగులు మాత్రం.. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 12 నెలలు జీతాలిస్తే.. కనీసం 10 సార్లు సమయానికి జీతాలు రాలేదని గుర్తు చేసుకుని నిట్టూరుస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close