డిప్యూటీ సీఎంకు ఏపీ కోవిడ్ వైద్యం నచ్చలేదా..?

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి ఆంజాద్ భాషా కుటుంబానికి కరోనా సోకింది. కొద్ది రోజుల నుంచి ఈ ప్రచారం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి .. వైయస్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు ఇడుపుల పాయ వెళ్లినప్పుడు కూడా.. ఆయనకు అంజాద్ భాషా స్వాగతం చెప్పిన వారిలో కనిపించలేదు. దాంతో… ఆయనకు కరోనా సోకిందన్న ప్రచారం ఉద్ధృతం అయింది. నాలుగు రోజుల తర్వాత ఆయనకు కరోనా సోకిందని.. తిరుపతి ఆస్పత్రిలో చేరారని ప్రకటించారు. అయితే.. సాయంత్రానికి ఆయన కుటుంబం.. తిరుపతి ఆస్పత్రి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయింది. అక్కడ ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో.. చేరినట్లుగా తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా విజృంభిస్తోంది. పలువురు ప్రముఖులకూ కరోనా సోకింది. ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న వారు.. ఉన్నతాధికారులు కూడా కరోనా బారిన పడ్డారు. వీరిలో ఎవరూ… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్స పొందడానికి ఆసక్తి చూపించడం లేదు. వారంతా.. నేరుగా హైదరాబాద్ వెళ్లి కార్పొరేట్ ఆస్పత్రుల్లో చేరిపోతున్నారు. అక్కడ ఆస్పత్రులు.. లక్షలకు లక్షలు బిల్లులు వేస్తున్నాయని… విమర్శలు వస్తున్నా సరే..వారు వెనుకాడటం లేదు. ఎన్ని లక్షలు ఖర్చు అయిన సరే.. తమకు ప్రాణమే ముఖ్యమన్నట్లుగా.. హైదరాబాద్ వెళ్లి… కరోనాను క్యూర్ చేయించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

అధికారులు… ఇతర ప్రముఖులు.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా చికిత్స పొందితే…. సామాన్యులకూ భరోసా ఉంటుంది. కరోనా సోకిందని తెలియగానే.. వచ్చి టెస్టులు చేయించుకుని.. చికిత్స పొందడానికి ప్రాధాన్యం ఇస్తారు. కానీ.. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులే.. కోవిడ్ ఆస్పత్రుల్లో చికిత్సపై నమ్మకం లేదన్నట్లుగా ఇతర రాష్ట్రాలకు పోతూండటంతో.. ప్రజల్లోనూ అప నమ్మకం ప్రారంభమవుతోంది. ఇప్పటికే.. హోం ఐసోలేషన్‌లోనే ఉంటామని… ఆస్పత్రులకు రాబోమని చెప్పేవారి సంఖ్య ఎక్కువగా ఉంటోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. అదేసమయంలో.. కోవిడ్ సెంటర్లలో ఆహారం సహా.. మౌలిక సదుపాయాలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో కోవిడ్ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెంచాల్సిన ప్రభుత్వ బాధ్యులు… తామే ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తూ.. ప్రభుత్వంపై విమర్శలు వచ్చేలా చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close