షాకింగ్ : హైకోర్టు జడ్జిల ఫోన్ల ట్యాపింగ్..!?

ఆంధ్రప్రదేశ్‌లో అవాంఛనీయమైన పరిణామాలు రోజు రోజుకు వెలుగు చూస్తున్నాయి. అక్కడ న్యాయవ్యవస్థ విశ్వసనీయతపై దెబ్బ కొట్టేందుకు భారీ కుట్రలు జరుగుతున్నాయని మాజీ న్యాయమూర్తి ఈశ్వరయ్య ఫోన్ సంభాషణతో వెల్లడయింది. తాజాగా ఇప్పుడు.. న్యాయమూర్తుల ఫోన్ల ట్యాప్ అయ్యాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఐదుగురు న్యాయమూర్తులు తమ ఫోన్లలో సాంకేతిక సమస్యలు వచ్చినట్లుగా అనుమానించి… పరిశీలన చేయించడంతో ఈ విషయం బయటపడిందని.. తెలుగు ప్రముఖ దినపత్రిక ప్రకటించింది. న్యాయమూర్తుల పేర్లు చెప్పకపోయినా… విశ్వసనీయమైన సమాచారం లేకపోతే.. ఇలా రాసే అవకాశం లేదు.

ఏపీలో న్యాయమూర్తులపై అధికార పార్టీ కొంత కాలంగా ఎదురు దాడి చేస్తోంది. మొదట అధికార పార్టీ నేతలు.. తర్వాత సోషల్ మీడియా ద్వారా.. ఆ తర్వాత రాజ్యాంగ బద్ద పదవుల్లో ఉన్న వారి ద్వారా.. ఈ దాడి జరుగుతోంది. గతంలో… ఓ అంశంలో వ్యతిరేక తీర్పు వచ్చినప్పుడు.. బాపట్ల ఎంపీ నందిగం సురేష్.. హైకోర్టు న్యాయమూర్తుల కాల్ డేటా బయట పెట్టాలని డిమాండ్ చేశారు. అలా ఎందుకుకు అన్నారో కానీ.. ఇప్పుడు సంచలనాత్మకంగా.. వారి ఫోన్లు ట్యాప్ అయినట్లుగా సాంకేతిక విభాగం నిర్ధారించడం.. కలకలం రేపుతోంది. దినపత్రిక ఈ విషయాన్ని బయట పెట్టడానికి ముందే తమ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని అనుమించిన ఆ న్యాయమూర్తులు… అన్ని రకాల సాంకేతిక పరీక్షలు చేయించారు. తమ ఫోన్లు వేరేవారి నియంత్రణలోకి వెళ్లినట్లుగా ఆధారాలు కూడా సేకరించారు.

ఇప్పటికే ఈశ్వరయ్య ఆడియో టేపుల వ్యవహారంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రవీంద్రన్ నేతృత్వంలో విచారణకు హైకోర్టు ఆదేశించింది. సీబీఐ, విజిలెన్స్ రవీంద్రన్‌కు సహకరించాలని స్పష్టం చేసింది. నాలుగు వారాల్లో రవీంద్రన్ నివేదిక సమర్పించనున్నారు. ఈ లోపే… ఫోన్ ట్యాపింగ్ అంశం తెరపైకి వచ్చింది. ఇది ఇంకా సీరియస్ నేరం. హైకోర్టు న్యాయమూర్తులు ముందుగానే సాంకేతిక ఆధారాలను సిద్ధం చేసుకున్నందున… విచారణకు ఆదేశిస్తే మాత్రం.. ఎవరు ఫోన్ ట్యాప్ చేశారో పసిగట్టడం చాలా సులువు. న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ చేసే అవసరం.. అంత సాంకేతికత ఎవరికి ఉంటుంది..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

మహాసేన రాజేష్‌కు మళ్లీ పవన్‌పై కోపం వచ్చింది !

మహాసేన రాజేష్ రాను రాను కూటమికి సమస్యగా మారుతున్నారు. తాజాగా ఆయన పవన్ కల్యాణ్ విజయం రాష్ట్రానికి ప్రమాదకరం అంటూ ఓ వీడియో చేశారు. అంతగా ఆయనకు ఎందుకు పవన్ పై కోపం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close