దుబ్బాకలో ప్రచారానికి పవన్ కల్యాణ్..!?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో జనసేన పార్టీ కన్నా.. బీజేపీ గురించే ఎక్కువ ట్వీట్లు.. ప్రకటనలు చేస్తున్న ఆయనను గరిష్టంగా ఉపయోగించుకోవాలని బీజేపీ నేతలు ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో దుబ్బాక అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరుగుతున్నాయి . బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పోటీ చేస్తున్నారు. గతంలోనూ ఆయన అక్కడ పోటీ చేశారు. గ్రామగ్రామన ఆయన అనుచరణగణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గెలుపు అవకాశాలు ఉన్నాయని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలో పూర్తి స్థాయిలో ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు.

ఇప్పటికే తెలంగాణకు చెందిన ముఖ్యనేతలతా దుబ్బాకపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి వ్యూహాలు రచిస్తున్నారు. ఆరెస్సెస్ వర్గాలు కూడా రంగంలోకి దిగాయి. ప్రచారానికి ఊపు రావాలంటే… ఓ సూపర్ స్టార్ వస్తే బాగుటుందని అంచనా వేస్తున్నారు. ఆ సూపర్ స్టార్ పవన్ కల్యాణ్ అయితే బాగుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ దిశగా పవన్ కల్యాణ్‌ను ఒప్పించేందుకు ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన తర్వాత బండి సంజయ్… పవన్ కల్యాణ్ ను కలిశారు. కలిసి పని చేస్తామని ప్రకటించారు. పవన్ సేవల్ని ఉపయోగించుకుంటామని అప్పుడే చెప్పారు.

దీనికి తగ్గట్లుగా ప్రణాళిక సిద్దం చేసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ కూడా.. ఖాళీగానే ఉన్నారు. ఆయన సినిమాల షూటింగ్‌లు ఇంకా ప్రారంభం కాలేదు. ఒకటి లేదా రెండు రోజుల సమయం కేటాయించినా చాలని తెలంగాణ బీజేపీ నేతలు పవన్ కల్యాణ్‌పై ఒత్తిడి చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఢిల్లీ పెద్దలు ఓ మాట చెబితే పవన్ ప్రచారానికి వెళ్లడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు దుబ్బాక ప్రచారానికి వెళ్తే తర్వాత గ్రేటర్ ఎన్నికల్లోనూ పవన్ జోరు ప్రచారాన్ని చూడొచ్చని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close