మీడియా వాచ్ : షర్మిలకు కొండంత.. రేవంత్‌కు పిసరంత..!

తెలంగాణలో షర్మిల రాజకీయ పార్టీ అంటే.. అవాక్కవ్వాల్సిన తెలంగాణ మీడియా గొప్పగా ప్రోత్సహిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో సొంత రాష్ట్రం తెచ్చుకుని స్వయం పాలన చేసుకుంటున్న తెలంగాణలో పరాయి రాష్ట్రం నుంచి వచ్చిన నేతలు పార్టీ పెడుతున్నామంటే కొన్ని మీడియా సంస్థలు విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నాయి. షర్మిల రాజకీయ పార్టీ తొలి సమావేశం జరిగిన రోజున లోటస్ పాండ్ వద్ద కనీసం మూడువందల మంది కూడా లేరు. ఉన్న ఆ కొద్ది మందితో హడావుడి చేయడం.. హైప్ చేసుకోవడం బాగా తెలిసిన వైసీపీ స్ట్రాటజిస్టులు ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు. ఆ గోరంతను మీడియా కొండతలుగా చూపించింది. చర్చోపచర్చలు పెట్టింది. అంతా ఓ స్ట్రాటజీ ప్రకారం నడిచిపోయింది.

అదే సమయంలో తెలంగాణ బిడ్డ … రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారు. ఆయన పాదయాత్రను ఒక్క మీడియా కూడా కవర్ చేయడం లేదు. సాధారణ వార్తల్లో కూడా చోటు కల్పించడం లేదు. మరి ఆయన పాదయాత్ర సాదాసీదాగా సాగుతుందా అంటే.. అదేం లేదు. అచ్చం పేట నుంచి కాలి నడకన బయలుదేరిన ఆయన… వెంట.. వేలాది మంది ఉన్నారు. రోడ్డు వెంట జన జాతర కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రేవంత్ పాదయాత్ర కిక్ ఇస్తోంది. ఐదు రోజులయింది కానీ మీడియాలో మాత్రం.. షర్మిలకు ఇచ్చిన ప్రాధాన్యతలో ఐదు.. పది శాతం కూడా కేటాయించలేదు. దాంతో ఆయన పాదయాత్ర విశేషం.. ప్రత్యక్షంగా చూసే వారికి మాత్రమే తెలిసిపోతోంది.

ఇప్పుడు ప్రధాన మీడియా మొత్తం .. రాజకీయ కబంధ హస్తాల్లో చిక్కుకుంది., వారిలోనూ యాజమాన్యం తెలంగాణకు చెందినవారే ఎక్కువ. టీవీ9, ఎన్టీవీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇతర చానళ్లు కూడా తెలంగాణ యాజమాన్యంలోనే ఉన్నాయి. అవి కూడా… రేవంత్ రెడ్డి పాదయాత్రకు కవరేజీ ఇవ్వడం లేదు. తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్రా బిడ్డ ఎంత దున్నేస్తుందో చెప్పడానికే అవి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ మీడియా స్ట్రాటజీలను ఎవరు డిసైడ్ చేస్తున్నారో కానీ.. తెలంగాణ ప్రజలు.. పరాయి పాలన కోరుకుంటున్నారన్న అభిప్రాయాన్ని కల్పించడానికి ప్రయత్నిస్తున్నారన్న చర్చ మాత్రం నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జాత‌రలో అల్ల‌రోడి ఫైటింగులు!

అల్ల‌రి న‌రేష్‌... ఈమ‌ధ్య ర‌క‌ర‌కాల జోన‌ర్లు ట‌చ్ చేస్తున్నాడు. సోష‌ల్ మెజేజ్ ఉన్న క‌థ‌ల్ని, త‌న‌దైన కామెడీ స్టోరీల్ని స‌మాంత‌రంగా చేసుకొంటూ వెళ్తున్నాడు. మ‌రోవైపు క్యారెక్ట‌ర్ పాత్ర‌ల‌కు న్యాయం చేస్తున్నాడు. ఇప్పుడు యాక్ష‌న్...

ఇంకా బీజేపీకి దగ్గరేనని వైసీపీ చెప్పుకుంటుందా !?

భారతీయ జనతా పార్టీ తమ వ్యతిరేక కూటమిలో చేరి తమ ఓటమిని డిక్లేర్ చేస్తోందని తెలిసిన తర్వాత కూడా వైసీపీ నాయకులు ఇంకా తమకు బీజేపీపై ఎంతో అభిమానం ఉందన్నట్లుగా వ్యవహరిస్తే...

హైద‌రాబాద్ లో భూమి కొన్న మైక్రోసాఫ్ట్…

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ త‌న కార్య‌క‌లాపాల‌ను మ‌రింత విస్తృతం చేయ‌నుంది. ఇప్ప‌టికే హైద‌రాబాద్ స‌హా దేశంలోని ప్ర‌ముఖ న‌గ‌రాల నుండి మైక్రోసాఫ్ట్ ఆఫీసులు ప‌నిచేస్తుండ‌గా, అతిపెద్ద డేటా సెంట‌ర్ ను...

‘స్వ‌యంభూ’ యాక్ష‌న్‌: 12 రోజులు… రూ.8 కోట్లు

'కార్తికేయ 2'తో నిఖిల్ ఇమేజ్ మొత్తం మారిపోయింది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఇది వ‌ర‌కు రూ.8 కోట్లుంటే నిఖిల్ తో సినిమా చేసేయొచ్చు. ఇప్పుడు ఓ యాక్ష‌న్ సీన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close