మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్..!?

గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలు దౌర్జన్యాలు, దాడులతో పాటు పోలీసులు ప్రమేయం వల్ల జరిగాయని .. ఇది ప్రజాస్వామ్యాన్ని పాతరేయడమేనని విపక్షాలు ఆరోపణలు చేశాయి. అవంటే గ్రామాలు అనుకుంటే ఇప్పుడు ఆ పరిస్థితిని పట్టణాలకు కూడా తీసుకు వచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాల కోసం వైసీపీ తెగ ఆరాటపడుతోంది. అందు కోసం పోలీసుల్నే ప్రయోగిస్తోంది. అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారి ఇళ్లకు పోలీసులు వెళ్లి రచ్చ చేస్తున్నారు. అభ్యర్థిత్వం ఉపసంహరించుకోవాలని నేరుగా చెప్పారు. ముందుగా పోలీసులు భయపెట్టి వెళ్తారు. లేదా పాత కేసుల్లోనో….కొత్త ఫిర్యాదులు వచ్చాయనో.. అభ్యర్థినో వారి కుటుంబసభ్యులనో పోలీస్ స్టేషన్ కు పిలిపిస్తారు.

పోలీసులు జోక్యం చేసుకున్న తర్వాత వైసీపీ నేతలు రంగంలోకి దిగుతారు. కేసుల్లేకుండా చూస్తామని పోటీ నుంచి విరమించుకోవాలని బేరం మాట్లాడుకుంటారు. ఈ పరిస్థితి కార్పొరేషన్లు మున్సిపాలిటీలు అన్నింటిలోనూ జరుగుతోంది. పోలీసుల తీరుపై తీవ్రమైన ఆరోపణలు వస్తూండటంతో తిరుపతిలో.. నిమ్మగడ్డ ర మేష్ కుమార్ కూడా స్పందించారు. ఎన్నికల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన అభ్యర్థుల్ని, బంధువుల్ని పీఎస్‌కు పిలవకూడదుని ఆదేశించారు. పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి బెదిరించడం జరగకూడదన్నారు. అయితే ఆయన ఆదేశాలు అమలు కావడం కష్టమే. ఇప్పటికే పోలీసుల సౌజన్యంతో పెద్ద ఎత్తున ఇతర పార్టీల అభ్యర్థుల వద్ద నుంచి ఉపసంహరణ లెటర్లు తీసుకున్నారని.. చివరి రోజున సమర్పించేసి.. అందర్నీ పోటీ నుంచి తప్పించేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

అదే జరిగితే.. మున్సిపల్ ఎన్నికల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పోలీసులకే దక్కుతుందని విపక్ష నేతలు అంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్ని సార్లు స్థానిక నేతలకు మొరపెట్టుకున్నా.. ప్రయోజనం ఉండటం లేదు. ఇదే పద్దతి కొనసాగితే.. రేపు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలా ఏకగ్రీవాలు చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదన్న చర్చ నడుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close