స్వరూపానందకు మొక్కులు…! సీపీఐ ఇజ్జత్ తీసేసిన నారాయణ..!

కమ్యూనిస్టులు అంటే కరుడుగట్టిన హేతువాదులు. వారు వాస్తవిక వాదాన్నే నమ్ముతారు. మానవత్వాన్ని.. మంచిని నమ్ముతారు కానీ.. దేవుళ్లను కాదు. ఇలాంటి భావజాలం ఉన్న వారే కమ్యూనిస్టులు అవుతారు. ఆ పార్టీల్లో పై స్థాయికి వెళ్లిన వారంటే మరింత కరుడు గట్టిన భావజాలంతో ఉన్న వారుంటారు. సీపీఐ పార్టీలో నారాయణ ఉన్నత స్థానానికి ఎదిగారు. కానీ ఆయన మాత్రం భిన్నంగా ప్రవర్తిస్తున్నారు. విశాఖలో ప్రచారం చేస్తూ నేరుగా శారదా పీఠానికి వెళ్లిపోయారు. భక్తుడిగా ముకుళిత హస్తాలతో శారదా పీఠం స్వరూపానందకు నమస్కారం చేశారు.

ఆయన శాలువా కప్పితే కప్పించుకున్నారు. మీరు అడిగితే అన్ని పార్టీలను గెలిపిస్తారంట కదా.. సీపీఐని కూడా గెలిపించాలని కోరారు. దానికి స్వరూపానంద ఏమని చెప్పి ఉంటారో కానీ.. తాను వైసీపీని గెలిపించడానికి ఇప్పటికే యాగాలు.. చేసేశానని మనసులో అనుకుని ఉంటారు. సీపీఐ నారాయణ ఇలా శారదాపీఠానికి వెళ్లడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన ఇలాంటి పనులు చేయబట్టే.. ఆయన మాటలు, చేతలను ఎవరూ సీరియస్ గా తీసుకోవడం లేదని.. అది సీపీఐ ఉనికికే ఇబ్బందికరంగా మారుతోందని మండిపడుతున్నారు.

అయితే సీపీఐ నారాయణ మాత్రం.. ఇలాంటి వాటిని పట్టించుకోరు. సందర్భం వచ్చినప్పుడు.. తాను ముకుళిత హస్తాలతో మనస్కారం చేసిన స్వరూపానందను దొంగ స్వామి అని తిట్టేయగలరు. వైసీపీ ఆస్థాన స్వామిజీగా పేరు తెచ్చుకున్న స్వరూపానందను కలవాలని కమ్యూనిస్టు నేత అనుకోవడమే విచిత్రం అయితే… వెళ్లి నమస్కారం చేసుకుని రావడం మరింత విడ్డూరం. ఇవన్నీ సీపీఐ నారాయణకు మాత్రమే సాధ్యం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మరోసారి అభాసుపాలైన హరీష్ ..!!

సీఎం రేవంత్ రెడ్డికి ఇటీవల వరుస సవాళ్ళు విసిరి నవ్వులపాలైన బీఆర్ఎస్ ఎమ్మెల్యే హారీష్ రావు మరోసారి అభాసుపాలు అయ్యారు. రిజర్వేషన్ల విషయంలో ఢిల్లీ పోలీసులు నోటిసులు ఇచ్చారని, ఆలస్యం చేయకుండా రేవంత్...

ఓటేస్తున్నారా ? : పోలవరం వైపు ఓ సారి చూడండి !

ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కరువులో నిండా మునిగిపోవాలో.. కనీసం రైతుల కడుపు నింపుకోవాలో తేల్చుకోవాల్సిన సంధి స్థితిలో ఉంది. ప్రజలు ఓట్లు వేయడానికి సిద్ధమయ్యారు. గతంలో ఓట్లు వేశారు. ఐదేళ్లలో ఏం...

ఏది నైతికత… ఏది అనైతికత ..!?

రిజర్వేషన్లపై అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ సోషల్ మీడియా టీంకు నోటిసులు జారీ చేయడంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రిజర్వేషన్ల విషయంలో తమపై అభాండాలు వేస్తున్నారని గగ్గోలు పెడుతోన్న...

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close