ఎన్నికల ప్రచారం అంటే రేవంత్ ఒక్కడిదేనా బాధ్యత..!?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో టీ పీసీసీ చీఫ్ పదవి కోసం చాలా మంది ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డికి మాత్రం వద్దు.. ఆయనకన్నా మాకు స్టామినా ఎక్కువని వాదిస్తున్న నేతలు… పార్టీ పరమైన కార్యక్రమాల్లో మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. సొంత యాత్రలు చేసుకుంటున్నారు. ఎన్నికల్లో .. పార్టీని అసలు పట్టించుకోవడం లేదు. గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరి ప్రచారం చేసిన రేవంత్.. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ అదే చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ తరపున రేవంత్ తప్ప ఎవరూ పెద్దగా కనిపించడం లేదు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ .. అప్పుడప్పుడు నల్లగొండలో ప్రచారం చేస్తున్నారు.

టీపీసీసీ చీఫ్ కోసం పోటీపడ్డ నేతలు ఎన్నికల ప్రచారంలో కనిపించడం లేదు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ నియోజక వర్గంలో మాజీ మంత్రి చిన్నారెడ్డిని పోటీకి పెట్టింది. అక్కడ కూడా సీనియర్లు ఎవరు కనిపించడం లేదు. ఎంపీ రేవంత్‌రెడ్డి సర్వం తానై వ్యవహరిస్తూ ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ సీనియర్లు కూడా ఎన్నికలతో తమకేం సంబంధం లేదన్నట్లుగా ఉన్నారు. కలిసొచ్చే ఒకరిద్దరు నేతల సహాయంతో అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మల్లు రవి, ఎమ్మెల్యే సీతక్క, పొన్నం ప్రభాకర్ వంటి నేతలతో ప్రచారాన్ని సాగిస్తున్నారు.

మరో వైపు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేయకుండా… భట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి లాంటి నేతలు.. సొంత యాత్రలు చేస్తున్నారు. జీవన్ రెడ్డి పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ సైకిల్ యాత్రలు చేస్తున్నారు. ఇది కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారమేనని వారు కవర్ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ నేతల తీరు చూసి.. పదవులు ఇస్తేనే ప్రచారం చేస్తామన్నట్లుగా వారి తీరు ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ధైర్యంగా నిర్ణయాలు తీసుకోలేని కాంగ్రెస్ హైకమాండ్ … అలా ఉన్నంత కాలం కాంగ్రెస్ నేతల వైఖరిలో మార్పు రాదని.. అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్ రెడీ!

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్‌! చాలాకాలంగా ప‌వ‌న్ అంటే రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాలే గుర్తుకు వ‌స్తున్నాయి. ఆయిన పాలిటిక్స్ తో అంత బిజీ అయ్యారు. అందుకే సినిమాల‌కు గ్యాప్ ఇచ్చారు. ఎన్నిక‌లు...

తాత – తండ్రి – మ‌న‌వ‌డు.. ముగ్గురూ ఒక్క‌డే!

తమిళ స్టార్ హీరో అజిత్ తో మైత్రీ మూవీస్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అధిక్‌ ర‌విచంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రానికి 'గుడ్ - బ్యాడ్ - అగ్లీ'...

నాగ‌శౌర్య‌కు ఏమైంది..?

టాలీవుడ్ లో హీరోలంతా య‌మా బిజీగా ఉన్న ద‌శ ఇది. చేతిలో ఒక‌టీ అరా విజ‌యాలు ఉన్న 'యావ‌రేజ్' హీరోలు సైతం.. త‌మ ఆధిప‌త్యం చూపిస్తున్నారు. చేతి నిండా సినిమాల‌తో హ‌డావుడి చేస్తున్నారు....

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close