సాయిధ‌ర‌మ్ తేజ్‌పై రెండు కేసులు

శుక్ర‌వారం రాత్రి హైద‌రాబాద్ లోని కేబుల్ బ్రిడ్జ్‌పై సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్ర‌మాదానికి గురైన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌మాదంలో తేజ్‌కి గాయాల‌య్యాయి. ఆయ‌న అప‌స్మార‌క స్థితిలోకి కూడా వెళ్లిపోయారు. ప్ర‌స్తుతం అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌పై రాయ‌దుర్గం పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. నిర్ల‌క్ష పూరిత‌మైన‌, వేగ‌వంత‌మైన డ్రైవింగ్ వ‌ల్ల ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు పోలీసులు ప్రాధ‌మిక నిర్దార‌ణ‌కు వ‌చ్చారు. దాంతో సాయిధ‌ర‌మ్ పై ఐపీసీ సెక్ష‌న్ 336, మోట‌ర్ వెహికిల్ యాక్ట్ 184 కింద రెండు కేసులు న‌మోదు చేశారు. తేజ్ హెల్మెట్ పెట్టుకోవ‌డం వ‌ల్ల పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఆయ‌న మ‌ద్యం సేవించి సేవించి ఉన్నాడ‌ని ముందు అనుమానించారు. కానీ అలాంటిదేం లేద‌ని వైద్యులు క్లారిటీ ఇచ్చారు. లేదంటే… డ్రంక్ అండ్ డ్రైవ్ సెక్ష‌న్ లో మ‌రో కేసు బుక్ అయ్యేది. తేజ్ కి స్పోర్ట్స్ బైక్స్ అంటే ఇష్టం. ఖాళీ స‌మ‌యాల్లో షికారు కొడుతుంటాడు. అయితే కేబుల్ బ్రిడ్జ్‌పై ఇసుకు పేరుకుపోవ‌డంతో బండి అదుపు త‌ప్పింది. ఆ స‌మ‌యంలో తేజ్ ఏ స్పీడులో బండి న‌డుతున్నాడో తెలియాల్సివుంది. సీసీ కెమెరా ఫుటేజీ చూస్తుంటే… తేజ్ మ‌రీ ప్ర‌మాద‌క‌ర‌మైన వేగంతో బండి న‌డ‌ప‌డం లేద‌ని అర్థ‌మ‌వుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close