బూతులు విని..బీపీ వచ్చి రియాక్టయ్యారు.. దాడులను సమర్థించిన సీఎం జగన్ !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సీఎం జగన్ ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యాలయాలు, ఇళ్లపై జరిగిన దాడులను సమర్థించారు. తనను అభిమానించే వారు.. ఆప్యాయత చూపే వారికి బీపీ వచ్చిన కారణంగా వచ్చిన రియాక్షన్‌గా ఆయన తేల్చారు. రికార్డెడ్‌ స్టేట్‌మెంట్‌ను మీడియాకు విడుదల చేశారు. అందులో దాడులు చేయడం శాంతిభద్రతలకు విఘాతం అని సీఎం ఏ రకంగానూ అనుకోలేదు. పైగా దాడులను సమర్థించారు.

ఎవరూ మాట్లాడని ఎవరూ మాట్లాడలేని అన్యాయమైన బూతులు మాట్లాడి టీడీపీ నేతలు రెచ్చగొట్టారన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నాను కానీ ఏ రోజు కూడా అన్యాయమైన మాటలు మాట్లాడలేదన్నారు. తనను బూతులు తిట్టడం టీవీల్లో చూసిన అభిమానించే వాళ్లు.. ప్రేమించే వాళ్లు.. బీపీ వచ్చి.. రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ఆ రకంగా వైషమ్యాలు క్రియేట్ చేసి రాజకీయంగా లబ్దిపొందాలనే ఆరాటం రాష్ట్రంలో కనిపిస్తూ ఉందన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులు జరిగిన తర్వాత ప్రెస్‌మీట్ నిర్వహించి తమకు సంబందం లేదని.. తమ పార్టీ వారు కాదని ప్రకటించారు. టీడీపీ వాళ్లే దాడి చేసుకుని ఉంటారని హోంమంత్రి సుచరిత ప్రకటించారు. అయితే సీఎం జగన్ మాత్రం .. తమను బూతులు తిట్టినందున అభిమానించే వాళ్లే బీపీ వచ్చి దాడి చేసి ఉంటారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి జగన్ .. దాడులను సమర్థించడంపై ఏపీ వ్యాప్తంగా విస్మయం వ్యక్తమవుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!

ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం...

టీడీపీలోకి క్యూ కడుతున్న వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు

వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు టీడీపీలోకి పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. అందరూ చంద్రబాబు, లోకేష్ సమక్షంలోనే కాదు..ఎవరు అందుబాటులో ఉంటే వారి సమక్షంలో చేరిపోతున్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ గట్టిపోటీ...

ప్రతి ఇంట్లో ఫోటో ఉండేలా పాలన చేస్తానంటే ఇలానా !?

మా పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఏంటి అని ఓ పులివెందుల రెడ్డిరైతు భారతిరెడ్డిని ప్రశ్నించారు. ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. కానీ మనసులో అనుకునే ఉంటారు. ఎన్నికల్లో హామీ ఇచ్చారు అందుకే...

సీరం ఇన్‌స్టిట్యూట్ బీజేపీకి 50 కోట్ల విరాళం ఇచ్చిందా…కారణం ఇదేనా..?

కోవిషీల్ద్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలకు కారణం అవుతుందని వ్యాక్సిన్ తయారీదారు అంగీకరించిన నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ పై కాంగ్రెస్ ఎదురుదాడి ప్రారంభించింది. జర్మనీ, డెన్మార్క్, నెథర్లాండ్స్, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలు ఆస్ట్రాజెనికా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close