అర్హత లేని వారే నిలదీస్తున్నారని సజ్జల కవరింగ్ !

గడప గడపకూ వెసీపీ కార్యకర్తల ఇళ్లకే అయినా నిరసనలు ఎదురు కావడం.. అవి మీడియాలో విస్తృత ప్రచారం కావడంతో కవర్ చేసేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ఎప్పట్లాగే మీడియా ముందుకు వచ్చారు. నిరసనలు చేస్తున్న వారికి పథకాలు అందని మాట నిజమే కానీ వారెవరూ అర్హులు కాదని తేల్చారు. అర్హత లేని వాళ్లు కూడా పథకాలు కావాలని డిమాండ్ చేస్తున్నారని సజ్జల చెబుతున్నారు. నిరుపేదలకు కూడా సాధించలేనంత అర్హతా ప్రమాణాలు నిర్దేశించామని ఆయన అనుకోవడం లేదు.

తొలి రోజు నిరసనలు షాకివ్వడంతో రెండో రోజు నుంచి స్ట్రిక్ట్‌గా వైసీపీ కార్యకర్తలు.. పథకాల ద్వారా లబ్ది పొందిన వారి ఇళ్లకే వెళ్లాలని.. వీడియోలు తీసివైరల్ చేయాలని సూచనలు చేశారు. ఈ అంశంపైనా సజ్జల క్లారిటీ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లకు కూడా వెళ్లమంటున్నామని.. వారి ఆశీస్సులు కూడా ఎమ్మెల్యేలకు కావాలని ఆయన అంటున్నారు. అయితే గడపగడపకూ జరుగుతున్న కార్యక్రమంలో మాత్రం కనిపిచడం లేదు. తొలి రోజు గడపగడపకూ వెళ్లిన సగం మంది ఎమ్మెల్యేలు రెండో రోజు కనిపించలేదు.

ద్వితీయ శ్రేణి నేతలో మ మ అనిపిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంత కాలం నిర్వహించాలో కూడా స్పష్టత లేదు. రెండేళ్ల ముందు ఇంటింటికి తిరగడం వల్ల ప్రయోజనం ఉండదని.. రాను రాను అన్ని పథకాల్లో లబ్దిదారులను తగ్గిస్తూంటే వారంతా వ్యతిరేకులుగా మారుతున్నారని వైసీపీ క్యాడర్ ఆందోళన చెందుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఖాతాల్లో డబ్బులేయలేదు ..డ్రామాలే !

ఓటర్ల ఖాతాల్లో పధ్నాలుగు వేల కోట్లు జమ చేస్తున్నట్లుగా వైసీపీ చేసిన డ్రామాలు తేలిపోయాయి. అంతా ఉత్తదేనని తేలిపోయింది. హైకోర్టు శుక్రవారం ఒక్క రోజు నగదు జమ చేయడానికి చాన్సిచ్చింది. బ్యాంకులు ప్రారంభం...

ఎంపీని చేస్తానని తల్లిని కూడా మోసం చేసిన జగన్ : షర్మిల

జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వంపై షర్మిల సంచలన విషయాలు బయట పెట్టారు. షర్మిల రాజకీయాన్ని కించ పరిచేందుకు ఆమెకు పదవీ కాంక్ష అని..డబ్బులు అడిగితే ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీలో చేరారని జగన్ విమర్శలు...

నగదు బదిలీపై ఏపీ సర్కార్‌కు మరోసారి “లెంగ్తీ క్వశ్చన్స్” వేసిన ఈసీ !

ఓటర్ల ఖాతాలో నగదు జమ చేయాలని తెగ ఆత్రపడుతున్న ఎన్నికల సంఘానికి ఈసీ మరోసారి షాకిచ్చింది. ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి ఈసీ మరో లేఖ రాసింది. జనవరి 2024...

వారంతా బీజేపీలో చేరగానే పునీతులయ్యారా..?కేటీఆర్ ఫైర్

ఢిల్లీ మద్యం కుంభకోణంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ అనేది ప్రభుత్వ అంతర్గత వ్యవహారమని, ప్రభుత్వాలు పాలసీలను మార్చడం సాధారణమన్న కేటీఆర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close