చంద్రబాబు జపం చేస్తున్న మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే !

తెలంగాణ రాష్ట్ర సమితిలో రాను రాను చంద్రబాబు, ఎన్టీఆర్ అభిమానులు పెరిగిపోతున్నారు. కాంగ్రెస్‌లో గెలిచి టీఆర్ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఇప్పుడు తాను చంద్రబాబు ఫ్యాన్ ను అంటున్నారు. అలా ఇలా కాదు.. ఏకంగా .. తన ఎమ్మెల్యే పదవి చంద్రబాబు పెట్టిన భిక్ష అంటున్నారు. గత ఎన్నికల్లో సుధీర్ రెడ్డి పోటీ చేయాల్సిన ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని మొదట టీడీపీ తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే చివరి క్షణంలో కాంగ్రెస్‌కు కేటాయించారు. అక్కడ టీడీపీ తపునపోటీ చేయాల్సిన సామ రంగారెడ్డిని ఇబ్రహీంపట్నంకు పంపించారు. ఎల్బీనగర్ నుంచి పోటీ చేసిన సుధీర్ రెడ్డిగెలిచారు. సామ రంగారెడ్డి ఓడిపోయారు.

తనకు ఎల్పీనగర్ దక్కకుండా ఉత్తమ్, మల్ రెడ్డి వంటివారు కోట్లు ఖర్చుపెట్టారని.. కానీ చంద్రబాబు మాత్రం అక్కడ తాను అయితేనే గెలుస్తానని భావించి టిక్కెట్ వచ్చేలా సహకరించారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఆ రోజు సహకరించకపోతే.. తాను ఎమ్మెల్యేగా ఉండేవాడిని కాదన్నారు. 2019లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. చంద్రబాబు చేసిన సాయానికి గుర్తుగా ఎల్బీనగర్‌లో ఎన్టీఆర్ విగ్రహం పెడతానని కూడా ప్రకటించారు.

నిజానికి సుధీర్ రెడ్డి వైఎస్ ముఖ్య అనుచరుడు. జగన్‌కు సన్నిహితుడనే పేరు ఉంది. ఆ కారణంగానే ఆయనతో బేరసారాలు ఆడి టీఆర్ఎస్ లో చేర్పించగలిగారని అంటూంటారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా అయన చంద్రబాబు జపం చేస్తున్నారు. ఎల్బీనగర్‌లో ఉన్న సెటిలర్ల ఓట్లే అలా మాట్లాడిస్తున్నాయన్న అభిప్రాయం ఎక్కువ మందిలో వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close