అమరావతిలో “కట్టిన గ్రాఫిక్స్” అద్దెక్కిస్తున్న జగన్ సర్కార్ !

అమరావతి భూముల్ని వేలం వేయడమే కాదు ఇప్పుడు అక్కడ కట్టిన భవనాలను కూడా అద్దెకు ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు సీఆర్డీఏ ప్రతిపాదించింది. సీఎం జగన్ ఆమోదించేశారు. అమరావతిలో చంద్రబాబు హయాంలో ఉద్యోగుల కోసం పలు టవర్లు నిర్మించారు. అలాగే ఎమ్మెల్యేలు .. న్యాయమూర్తుల కోసం కూడా భవనాలు నిర్మించారు. కొన్ని 80 శాతం వరకూ పూర్తయ్యాయి. జగన్ సర్కార్ వచ్చిన తర్వాత వాటిని అలా నిరుపయోగంగా ఉంచారు. కనీసం మిగిలిన పనులు కూడా పూర్తి చేయలేదు.

గ్రూప్ డీ ఉద్యోగుల కోసం నిర్మించిన భవనాలు ఉద్యోగులకు ఇవ్వకుండా.. ఇప్పుడు ప్రైవేటుగా ఎవరికైనా లీజుకు ఇవ్వాలని సీఆర్డీఏ ప్రతిపాదించింది. ఈ మేరకు చంద్రబాబు హయాంలో అమరావతికి తీసుకొచ్చిన రెండు ప్రైవేటు యూనివర్శిటీలతో సంప్రదింపులు జరిపారు. వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విట్ యాజమాన్యం.. ఓ భవనం అద్దెకు తీసుకుని.. విద్యార్థులకు వసతి సౌకర్యం ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసింది. ఏడాదికి రూ. పది కోట్లు వస్తాయన్న లెక్క చెప్పేసరికి జగన్ కూడా అంగీకరించినట్లుగా తెలుస్తోంది.

అమరావతిలో అసలు పనులేమీ జరగలేదని… అన్నీ గ్రాఫిక్సేనని విపరీతంగా ప్రచారం చేశారు. అమరావతిని స్మశానం అన్నారు. ఇప్పుడు ఆ స్మశానంలో స్థలాలను ఎకరాల కొద్దీ అమ్మాలని నిర్ణయించడమే కాకుండా గ్రాఫిక్స్ అని చెప్పిన వాటితోనే ఏడాదికి రూ. పది కోట్ల ఆదాయం కళ్ల జూడాలని డిసైడయ్యారు. అసలు పూర్తిగా నిర్వీర్యం చేసిన అమరావతి నుంచి ప్రభుత్వానికి ఇంత ఆదాయం వస్తూంటే.. నిజంగా అభివృద్ధి చేసి ఉంటే.. కాసుల పంట పండి ఉండేది కాదా అని చాలా మందికి వస్తున్న సందేహం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close