ఆర్కే పలుకు : బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ ఉండదు !

తెలంగాణలో అధికారంలోకి రావడానికి బీజేపీ నేతలు ముఖ్యంగా మోదీ, షాల కన్నా ఎక్కువగా సహకరిస్తోంది కేసీఆరే. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన వారాంతపు ఆర్టికల్ ద్వారా విశ్లేషించారు. సీఎం కేసీఆర్ బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించుకున్నారని.. దాని వల్ల ఆ పార్టీకి ఎంతో మేలు జరుగుతోందన్నారు. బీజేపీ ఉనికే లేని ఖమ్మం, నల్లగొండ వంటి జిల్లాల్లో కూడా యువతలో బీజేపీ కి క్రేజ్ వస్తోందన్నారు. ఇతర విపక్ష పార్టీలను నిర్వీర్యం చేసి.. బీజేపీని ప్రత్యర్థిగా కేసీఆర్ తెచ్చుకున్నారని మొదటి నుంచి జరిగిన పరిణామాలతో ఆర్కే తేల్చారు.

అయితే కాంగ్రెస్‌ను నిర్వీర్యం చేయడానికో లేదా.. రెండు సమాంతర శక్తుల మధ్య ఓట్లు చీలి విజయం సాధిస్తాననో కేసీఆర్ బీజేపీకి హైప్ ఇచ్చారనేది ఆర్కే విశ్లేషణ. అయితే అలా చేయడం మొదటికే మోసం తెస్తుందని ఆయన లెక్కలతో సహా చెప్పారు. బీజేపీని ప్రత్యర్థిగా ప్రకటించుకున్నప్రతీ సారి ఓడిపోయారని దుబ్బాక .. హుజురాబాద్.. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వంటి వాటిని రుజువులుగా చూపించారు. కాంగ్రెస్ ప్రత్యర్థిగా ఉన్న సాగర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇలాటి పరిస్థితుల్లో బీజేపీ సైలెంట్‌గా ఉంటుందని అనుకోలేమని.. కేసీఆర్ ఇచ్చిన హైప్‌తో అధికారం చేపట్టడానికి అవసరమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటుందని ఆర్కే అంటున్నారు.

అదే జరిగితే… అంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే టీఆర్ఎస్ మనుగడే కష్టమని ఆర్కే తేల్చేశారు. సంస్థాగత బలం ఉన్న కాంగ్రెస్ నిలదొక్కుకోగలదు కానీ ఫిరాయింపు నేతల మీద ఆధారపడిన.. తెలంగాణ సెంటిమెంట్ మాత్రమే బలంగా ఉన్న టీఆర్ఎస్ నిలబడే చాన్స్ లేదని ఆర్కే చెబుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంతా పచ్చగా నే ఉంటుందని.. కానీ అవుటాఫ్ బాక్స్ ఆలోచించాలని ఆయన అంటున్నారు. ఆర్కే మాటల్లో కేసీఆర్ పై కోపం కానీ ద్వేషం కానీ ఉండవు. వాస్తవ పరిస్థితులను విశ్లేషిస్తారు. మరి ఈ విషయాలను కేసీఆర్ ఆలోచించారో లేదో. అయితే ఆర్కే కన్నా కేసీఆరే గొప్ప రాజకీయ నాయకుడు.. విశ్లేషకుడు కూడా అనడంలో సందేహం లేదు.

మరో వైపు ఏపీలో మూడేళ్లకే ఈ ప్రభుత్వాన్ని ఇంకా రెండేళ్లు భరించాలా అనే పరిస్థితికి ప్రజలు వచ్చారని ఆర్కే తేల్చారు. ఏపీలో పరిస్థితుల్ని ఆయన కళ్లకు కట్టారు. పార్టీ క్యాడర్ హాజరు కావాల్సి నియోజకవర్గ ప్లీనరీలకు క్యాడర్ ఎవరూ రావడం లేదు.,. జనాల్ని తీసుకొస్తున్నారు. వారు మధ్యలో వెళ్లిపోతున్నారు. ఇవి కాకుండా ప్రజల్లో ప్రభుత్వ పాలనా తీరుపై అసంతృప్తి పెరిగిపోయింది. అక్కడ వైసీపీకి భవిష్యత్ లేదని ఆయన ఏకాభిప్రాయంతో ఉన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close