3 రాజధానుల కోసం వైసీపీ రాజ్యాంగ సవరణ !

మూడు రాజధానుల కోసం రాజ్యాంగ సవరణ చేయాలని వైసీపీ పట్టుబడుతున్నట్లుగా కనిపిస్తోంది. విజయసాయిరెడ్డి ఈ మేరకు రాజ్యసభలో ప్రైవేటు బిల్లు పెట్టారు. రాజధానిపై రాష్ట్రానికి సర్వాధికారాలు ఉండాలని ఈ మేరకు ఆర్టికల్ త్రీని సవరించాలని ఆయన బిల్లులోని సారాంశం. అది ప్రైవేటు బిల్లే కానీ… అలాంటి బిల్లును పరిగణనలోకి తీసుకోవాలని వైసీపీ బీజేపీపై ఒత్తిడి తెస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధాని అంశంపై వైసీపీ పూర్తిగా ఇరుక్కుపోయింది. ఎటూ కదల్లేని పరిస్థితికి చేరిపోయింది.

చట్ట ప్రకారం ఇక మూడురాజధానులు చేయలేరు. అమరావతిని నిర్మించి తీరాలి. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్ చేయలేదు. వచ్చే నెలలో సవాల్ చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడా అనుకూల తీర్పు వస్తుందని అనుకోవడం లేదు. అందుకే ఇప్పుడు రాజ్యాంగసవరణ కు ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. అసలు రాజ్యాంగంలోనే రాజధాని అనేదే లేదని జగన్ చాలా సార్లు చెప్పారు. అయినా ఇప్పుడు ఆర్టికల్ త్రీలో సవరణ కోసం వైసీపీ ఎందుకు ప్రయత్నిస్తుందో వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు.

సీఎం ఎక్కడి నుంచైనా పరిపాలించవచ్చు.. అని జగన్ చెబుతున్నారు. అందుకే ఆయన విశాఖ వెళ్లిపోవాలని రిషికొండ దగ్గర క్యాంప్ ఆఫీస్‌ను… రెడీ చేయించుకుంటున్నారు. దానిపై అనేక వివాదాలు ఏర్పడ్డాయి. అయినా వెనక్కి తగ్గట్లేదు. స్టార్ హోటల్ పేరుతో ..కడుతున్నారు కానీ అలాంటి సౌకర్యాలతో కాకుండా ఇంటి మాదిరిగా ప్లాన్ తీసుకోవడంతో అసలు విషయం బయటపడుతుంది. ఇలా ఒకదానికి కొకదానికి పొంతన లేకుండా రాజధాని విషయంలో వైసీపీ చేస్తున్న రాజకీయం.. గందరగోళంగా మారిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన వైసీపీ – ఎటు చూసినా కూటమి !

ఏపీలో ఎన్నికలు జరుగుతున్నాయి. వైసీపీ అసలు పోటీ చేస్తుందా లేదా అన్నంత దారుణంగా డల్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్ జగన్ నెల రోజుల పాటు బస్సు యాత్ర పేరుతో టైం...

నరేష్ ‘అల్లరి’కి పరీక్షా సమయం

నరేష్ 'అల్లరి' రూటు మార్చి అన్నీ సీరియస్ సినిమాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు 'ఆ ఒక్కటీ అడక్కు'తో మళ్ళీ తన అల్లరి జోన్ లోకి వచ్చారు. నరేష్ చేసిన కామెడీ సినిమాలు వరుసగా...

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు స్పెషల్ కోర్టు !

జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ...

జగన్‌కు చేత కాదని పదే పదే సర్టిఫికెట్ ఇస్తున్న సజ్జల !

సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి సలహాదారుడు ఉంటే చాలు మట్టికొట్టుకుపోవడానికి అన్నట్లుగా మరిపోయింది వైసీపీ పరిస్థితి. టీడీపీ మేనిఫెస్టోను చూపించి జగన్‌కు చేత కాదని ఆయన ప్రచారం చేస్తున్న వైనం వైసీపీ నేతలకూ ఇబ్బందికరంగానే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close