మళ్లీ మోదీతో భేటీకి చంద్రబాబుకు ఆహ్వానం !

ఓ సారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అందరితో కలిసి మోదీతో ఓ సమావేశంలో పాల్గొంటే.. ఇప్పటికీ పొత్తుల చర్చలను విశ్లేషకులు చేస్తూనే ఉన్నారు. మరోసారి చంద్రబాబుకు మోదీ నుంచి ఆహ్వానం అందింది. ఈ సారి మరో కీలకమైన అంశంపై సలహాలు, సూచనలు తీసుకు రావాలని చంద్రబాబును కోరారు. జీ-20 దేశాల కూటమికి భారతదేశం అధ్యక్షత వహించే అవకాశం భారత్‌కు లభించింది. ప్రపంచంలో మన దేశం తనదైన ముద్ర వేసేలా.. ఈ కూటమి నేతృత్వం ఉండాలని మోదీ అనుకుంటున్నారు.

అందుకే ఈ సదస్సు నిర్వహణపై రాజకీయ పార్టీల అధ్యక్షులతో ప్రధాని మోడీ చర్చించి.. సలహాలు తీసుకోనున్నారు. డిసెంబర్ 5న రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రి ప్రహ్లాద్ జోషి చంద్రబాబుకు ఆహ్వానం పంపడమే కాదు.. స్వయంగా ఫోన్ చేశారు. చంద్రబాబు కూడా అంగీకరించారు. అయితే ప్రధానమంత్రితో సమావేశానికి ఏపీ ప్రతిపక్ష నేతకు పిలుపు అంటే.. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరమైన చర్యలు కూడా సాగుతాయి. ఎదుకంటే ఏపీలో రాజకీయాలు డైనమిక్‌గా మారిపోతున్నాయి. పొత్తుల గురించి చర్చలు నడుస్తున్నాయి. అందుకే.. సమావేశం కూడా హాట్ టాపిక్ అయ్యే అవకాశం ఉంది.

2014లో ఎన్డీఏలో టీడీపీ ఉంది. 2018లో బయటకు వచ్చింది. ఆ తర్వాత మోదీని చంద్రబాబు ఒక్క సారిగా మాత్రమే కలిశారు. అది కూడా ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశంలో మాత్రమే కలిశారు. తాజాగా మరోసారి ప్రధాని సమావేశానికి చంద్రబాబు హాజరు కానుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం ఉత్కంఠ రేపుతోంది. గతంలో చంద్రబాబుతో మాట్లాడటానికి మోదీ ఆసక్తి చూపేవారు కాదు.. కరోనా సమయంలో అన్ని రాజకీయ పార్టీల నేతలతో మాట్లాడారు కానీ.. చంద్రబాబుతో మాట్లాడలేదు. కానీ ఇప్పుడు మాత్రం.. కీలకమైన అంశాల్లో చంద్రబాబును సమావేశానికి పిలుపుస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డీజీపీపై వేటు – పరిస్థితులు చేయి దాటిపోయిన తర్వాత !

ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిపై ఎన్నికలసంఘం వేటు వేసింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నెలన్నర తర్వాత.. ఎన్నో సార్లు విపక్షాలు డిమాండ్ చేస్తే... ఏపీలో శాంతిభద్రతలు పూర్తి స్థాయిలో అదుపు...
video

భ‌లే ఉన్నాడే టీజ‌ర్‌: ఏదో ‘తేడా’గా ఉందేంటి..?!

https://youtu.be/8JP8u45MqzA మారుతి టీమ్ నుంచి వ‌స్తున్న మ‌రో సినిమా 'భ‌లే ఉన్నాడే'. రాజ్ త‌రుణ్ హీరోగా న‌టించాడు. శివ సాయి వ‌ర్థ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈరోజే టీజ‌ర్ విడుద‌లైంది. టీజ‌ర్ చూస్తే మారుతి...

ఫ్లాష్ బ్యాక్‌: ఆ డైలాగుల‌కు పారితోషికం అడిగిన సూర్య‌కాంతం

పైకి గ‌య్యాళిలా క‌నిపించే సూర్యకాంతం. మ‌న‌సు వెన్న‌పూస‌. ఆమెతో ప‌ని చేసిన‌వాళ్లంతా ఇదే మాట ముక్త‌కంఠంతో చెబుతారు. తిట్లూ, శాప‌నార్థాల‌కు పేటెంట్ హ‌క్కులు తీసుకొన్న‌ట్టున్న సూరేకాంతం.. బ‌య‌ట చాలా చమ‌త్కారంగా మాట్లాడేవారు. అందుకు...

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close