ఏపీకి రావాలంటే కేసీఆర్ వాటన్నింటిపై క్లారిటీ ఇవ్వాల్సిందే !

ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి శాఖ దాదాపుగా ఏర్పాటయింది. కానీ ఇల్లు అలకగానే పండగ కాదు. కేసీఆర్ ఏపీకి రావాలంటే చాలా అంశాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది. బీఆర్ఎస్ నేతల చేరికల సందర్భంగా కేసీఆర్ వీటిపై స్పష్టత ఇవ్వలేదు. కనీసం ప్రస్తావించలేదు. వ్యూహాత్మకంగా ప్రసంగించారు. ఏపీలో దున్నేస్తామని కానీ.. మరొకటి కానీ చెప్పలేదు. పూర్తిగా జాతీయ కోణంలోనే కేసీఆర్ స్పీచ్ సాగింది. రాష్ట్ర సమస్యలపై నిర్దిష్టమైన విధానం చెప్పలేదు. అలాంటి వాటిపై స్పందించకపోతే ప్రజలు పట్టించుకోరు.

గత ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకున్న కేసీఆర్.. వైసీపీతో కలిశారు. ప్రత్యేకహోదా కోసం కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. ఇప్పటి వరకూ రాయలేదు. ప్పుడు ఏపీలో ప్రత్యేకహోదా అంశం కాదు.. ఒక రాజధానా. మూడు రాజధానులా అన్నది సమస్య. దీనిపై కేసీఆర్ ఏదో ఓ విధానం ప్రకటించాల్సి ఉంది. గతంలో కేటీఆర్ మూడు రాజధానులకు మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ విధానం ఇదేనా.. లేకపోతే మార్పు ఉందా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

విభజన ప్రక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల రెండు తెలుగురాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా సమస్యలు ఉన్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం తెలంగాణపై సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఉమ్మడి ఆస్తులు పంచడం లేదని న్యాయం చేయాలని కోరుతోంది. లక్ష కోట్లకుపైగా ఆస్తులు పంచాల్సి ఉందని చెబుతోంది. అలాగే విద్యుత్ బకాయులు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. ఇక జల వివాదాల విషయంలో ఎన్ని ఫిర్యాదులు.. రెండు రాష్ట్రాలపై ఒకరిపై ఒకరు చేసుకున్నారో చెప్పడం కష్టం. పోలవరంప్రాజెక్ట్ ఎత్తు తగ్గించాల్సిందేనని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తోంది పోలవరం ఏడు మండలాలు తెలంగాణకు ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలంటున్నారు. వీటన్నింటిపైనా కేసీఆర్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చేయవచ్చు.. అక్కడ పెద్దగా సవాళ్లు ఎదురు కావు. కానీ ఏపీలో మాత్రం అనేక సవాళ్లు ఎదురవుతాయి. ఎందుకంటే.. ఏపీ తెలంగాణతో ముడిపడి ఉంటుంది. తెలంగాణ ఉద్యమం కూడా ఏపీ వ్యతిరేకత కేంద్రంగానే నడిచింది. వీటన్నింటిని కాదని.. ఎవరో నలుగుర్ని చేర్చుకుని ఏపీలో సభ పెట్టి వెళ్లిపోతే.. అది రాజకీయం అనిపించుకోలేదు. మరి కేసీఆర్ క్లారిటీ ఇస్తారా ?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

దిల్ రాజు సినిమా మ‌ళ్లీ వాయిదా?

దిల్ రాజు బ్యాన‌ర్‌లో ర‌కూపొందించిన‌ 'ల‌వ్ మీ' మ‌ళ్లీ వాయిదా ప‌డే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ లో విడుద‌ల కావాల్సిన సినిమా ఇది. ఎన్నిక‌ల హ‌డావుడి వ‌ల్ల ఈనెల 25కు వాయిదా...

మోదీకి నో రిటైర్మెంట్ !

75 ఏళ్లకు మోదీ రిటైర్ అవుతారని అమిత్ షా ప్రధాని అవుతారని సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చిన కేజ్రీవాల్ చేసిన ప్రకటన బీజేపీలో చిచ్చు పెట్టింది. అలాంటి చాన్సే...

ఈసీకి ఏం చెప్పాలి… కారణాలు వెతుక్కుంటున్న ఏపీ సీఎస్

ఏపీలో జరుగుతోన్న హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించడంతో ఏం చెప్పాలన్న దానిపై సీఎస్ , డీజీపీ మల్లాగుల్లాలు పడుతున్నారు. రాష్ట్రంలో అల్లర్లతో అట్టుడుకుతుంటే ఎం చేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం...

విభజనకు పదేళ్లు : పట్టించుకునే స్థితిలో లేని ఏపీ పాలకులు !

పునర్విభజన చట్టంలో పదేళ్లలో అన్ని సమస్యలు పరిష్కారమయ్యేలా వివాదాలు లేకుండా ఉండేలా చూసేలా ఏర్పాట్లు చేశారు. అందుకే ఉమ్మడి రాజధాని అంశాన్ని పదేళ్ల పాటు చేర్చారు. ఇప్పుడు జూన్‌ 2 నాటికి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close