పాకీజాకు సాయం అందించిన చిరు, నాగబాబు! మోహన్ బాబు స్పందించరా ?

తెలుగు సినీ ప్రేక్షకులను 90వ దశకంలో అలరించిన పాకీజా ప్రస్తుతం దుర్భర జీవితాన్ని గడుపుతోంది. ఆమె పరిస్థితి తెలుసుకున్న తరువాత చిరంజీవి నాగబాబు సాయం అందించారు. వివరాల్లోకి వెళ్తే..

పాకీజా అన్న స్క్రీన్ నేమ్ కలిగిన వాసుకి 90వ దశకంలో అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం పంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే వివాహం చేసుకున్న తర్వాత భర్త శాడిస్ట్ మరియు తాగుబోతు కావడంతో జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కొంది. దీనికి తోడు అనేక ఆరోగ్య సమస్యలు రావడంతో సంపాదించుకున్న కాస్త డబ్బులు కూడా అయిపోయి ప్రస్తుతం ఒక హాస్టల్ లో నివసిస్తూ కాలం గడుపుతుంది. సోషల్ మీడియాలోని ఒక ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ, తినడానికి కూడా డబ్బు లేని పరిస్థితిలో ఉన్నా అంటూ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత ఆ ఇంటర్వ్యూ చూసిన నాగబాబు తన వంతుగా లక్ష రూపాయలు సహాయం అందించారు. పాకీజా కూడా సహాయం తీసుకున్న తర్వాత నాగబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తాజాగా ఆవిడ పరిస్థితి తెలియడంతో చిరంజీవి కూడా లక్ష రూపాయలు సాయం అందించడమే కాకుండా, అవకాశాలు ఇవ్వాల్సిందిగా సినీ మరియు టీవీ సీరియల్ దర్శకులకు విజ్ఞప్తి చేశారు. ఆవిడకు మళ్ళీ అవకాశాలు వచ్చేలా చూస్తానని భరోసా ఇచ్చారు.

మెగా బ్రదర్స్ చేసిన ఈ చిరు సాయాన్ని నెటిజన్లు కూడా ప్రశంసించారు. అయితే ఈ సందర్భంగా వారి చర్చలలో, పాకీజా చిరంజీవితో ఏ సినిమాలోనూ నటించలేదని, ఆవిడ ప్రధానంగా మోహన్ బాబు సినిమాలలో నటించారని, ఆవిడ పరిస్థితి తెలిసి కూడా మోహన్ బాబు ఎందుకు సాయం అందించడం లేదనే ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. అయితే నిజానికి కమర్షియల్ రంగం అయిన సినిమా పరిశ్రమలో సాయం చేసి తీరాలన్న రూల్ లేదు. అయితే,మోహన్ బాబు సినిమాలైన అసెంబ్లీ రౌడీ, రౌడీ గారి పెళ్ళాం వంట సినిమాలు సూపర్ హిట్స్ కావడం లో పాకీజా పాత్ర కూడా ఎంతో ఉందని గుర్తు చేస్తూ, తాను ఇండస్ట్రీ పెద్దను అని చెప్పుకోవడానికి ఉబలాటపడే మోహన్ బాబు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్న మంచి విష్ణు లు ఇలా సాయం చేయవలసి వచ్చిన సందర్భాలలో మాత్రం ఎందుకో వ్యూహాత్మక మౌనం పాటిస్తూ ఉంటారని సెటైర్లు విసురుతున్నారు నెటిజన్లు.

ఏది ఏమైనా, పాకీజా పరిస్థితి మెరుగుపడాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close