రాజీనామా వ్యవహారంపై తలసాని ఎదురుదాడి

హైదరాబాద్: తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ తన రాజీనామా వ్యవహారంపై ఇవాళ స్పందించారు. తనపై విమర్శలు గుప్పిస్తున్న టీ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులపై ఎదురుదాడికి దిగారు. తనను విమర్శించేముందు ఈ నాయకులు తమ తమ గురించి ఆలోచించుకోవాలన్నారు. అందరి గుట్టూ తనవద్ద ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వెళ్ళిన విషయాన్ని గుర్తు చేశారు. తర్వాత వైఎస్ సీఎమ్‌గా ఉన్నపుడు 9మంది టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పారు. గత ఏడాది ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎస్‌పీవై రెడ్డి, బుట్టా రేణుకలను టీడీపీలోకి పార్టీ కండువా కప్పి ఆహ్వానించింది ఎవరని ప్రశ్నించారు. కొత్తపల్లి గీత టీడీపీలో చేరలేదా అని అడిగారు. ఎమ్మెల్సీలు రుద్రరాజు పద్మరాజు, తిప్పేస్వామి, జూపూడిలను టీడీపీలోకి ఎలా చేర్చుకున్నారని అడిగారు. పార్టీలు మార్చిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యీల జాబితాను చదివారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా పట్టుబడిన దొంగకూడా తనగురించి మాట్లాడుతున్నారని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గవర్నర్‌కు ఫిర్యాదు చేసేముందు ఏపీలో టీడీపీలో చేరినవారిగురించి ప్రస్తావించాలని అన్నారు. ఎన్నికలు, పదవులు తనకు కొత్త కాదని చెప్పారు. తనపై పోటీకి ఎవరు వచ్చినా ఎదుర్కోటానికి తాను రెడీ అని సవాల్ విసిరారు. తాను డిసెంబర్ 16నే రాజీనామాను స్పీకర్‌కు సమర్పించానని చెప్పారు. రాజీనామా అంశం స్పీకర్ పరిధిలో ఉందని, ఆయన తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ముందుకు వెళ్తానని అన్నారు.పొద్దున్న లేస్తే అందరూ శ్రీనివాస యాదవ్ అంటున్నారని, కావాలంటే తనచుట్టూ తిరుగుతూ పూజలు చేసుకోవాలని ఎద్దేవా చేశారు. నాలుగు రోజులు రాజకీయాలు పక్కన పెడితే ఏం జరుగుతుందో అందరికీ తెలుసని హెచ్చరించారు.

మరోవైపు తెలంగాణ టీడీపీ నేతలు ఇవాళ తలసాని రాజీనామా వ్యవహారంపై గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. తలసానిని బర్తరఫ్ చేయాలని కోరుతూ లేఖ సమర్పించారు. అయితే గవర్నర్ సరిగా స్పందించలేదని చెబుతూ బయటకొచ్చి రాజ్‌భవన్ ఎదురుగా ధర్నాకు దిగారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close