ధనుష్, నాగార్జున మల్టీ స్టారర్ ‘కుబేర’ రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. లవ్ స్టోరీ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఆసక్తిని పెంచింది. సినిమా ప్రమోషన్స్ భాగంగా నాగార్జున విలేకరులతో మాట్లాడారు.
ధనుష్తో కలిసి స్క్రీన్ పంచుకోవడానికి కారణం?
– స్టార్స్ కలిసి పని చేస్తే కొత్త కథలు వస్తాయి. నేను ఎప్పటినుంచో మల్టీ స్టారర్స్ చేస్తున్నాను. మంచి కథలో ఒక మంచి పాత్రను చేయడంలో ఎక్కువ ఆనందం ఉంటుంది.
కుబేరలో కొత్త పాయింట్ ఏమిటి?
– అల్ట్రా రిచ్, మిడిల్ క్లాస్, బిలో పావర్టీ లైన్… ఇలా మూడు సొసైటీల క్లాష్ ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇలాంటి పాయింట్ ఇప్పటివరకు సినిమాల్లో రాలేదు. ఇది రెగ్యులర్ స్క్రీన్ప్లే కాదు. రొటీన్ క్యారెక్టర్లు కావు. ప్రతిదీ డిఫరెంట్గా ఉంటుంది. ఇందులో ఏ పాత్రనైనా హీరో, హీరోయిన్ అనడానికి లేదు. అన్ని పాత్రలు గానే ఉంటాయి. ఇలాంటి సినిమాలు చేయడానికి గట్స్ కావాలి.
మీ ఇమేజ్కి తగ్గట్టు స్క్రిప్ట్లో ఏమైనా మార్పులు చేశారా?
– లేదు. మారిస్తే చెడిపోతుంది.
‘కూలీ’లో ఎలాంటి పాత్ర చేస్తున్నారు?
– కంప్లీట్ విలన్ క్యారెక్టర్. సినిమా త్రూ అవుట్ ఉంటాను.
రీమేక్స్ చేస్తారా?
– లేదు. ఓటీటీ వచ్చిన తర్వాత రీమేక్స్ చేయడంలో పాయింట్ లేదు.
ఒక బిగ్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు?
– బిగ్ సినిమా అంటే ఏమిటి..? బిగ్ సినిమా అనే కాన్సెప్ట్ నా మైండ్ నుంచి పోయింది. ఇప్పుడు మంచి కథలున్న సినిమాలే బిగ్ ఫిలిమ్స్. పాత్ర బావుంటే కామెడీ రోల్ చేయడానికి కూడా రెడీ. బిగ్ అనే కాన్సెప్ట్ మైండ్లో లేకపోవడంతో హాయిగా ఉంది. పెయిడ్ ప్రమోషన్స్, పెయిడ్ పబ్లిసిటీ… ఎందుకు తలకాయ నొప్పి? నాలుగు దశాబ్దాలు ఇండస్ట్రీలో ఉన్నాను. ఇప్పటికీ రిలవెంట్గా ఉన్నాను. ఇంతకంటే ఏం కావాలి.
సోషల్ మీడియా గురించి మీ అభిప్రాయం?
– అదొక పెద్ద మాన్స్టర్. నేను దానికి దూరంగా ఉంటాను.
పాన్ ఇండియా ట్రెండ్పై మీ కామెంట్?
– పాన్ ఇండియా సినిమాలు చేయడం చాలా కష్టం. అన్ని సినిమాలు దానికి సరిపోవు.
ఓటీటీ వేదికలు సినిమా రిలీజ్ డేట్ను శాసిస్తున్నాయనే అభిప్రాయం ఉంది. నిజమేనా?
– వందశాతం నిజం. వాళ్ల స్లాట్ ప్రకారం రిలీజ్ డేట్ చెబుతారు. ‘కుబేర’కి కూడా జూన్లో రిలీజ్ కావాలని చెప్పారు.
100వ సినిమా ఎప్పుడు?
– ప్లానింగ్ జరుగుతోంది. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్తో పనులు కొనసాగుతున్నాయి.
ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ