రెచ్చగొట్టిన మీడియా: బాబుపై పవన్ ఫ్యాన్స్ గుర్రు

హైదరాబాద్: అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు విషయమై పవన్ ఫ్యాన్స్‌ను మీడియా రెచ్చగొట్టి వదిలి పెట్టారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వారు మండిపడుతున్నారు. మరి ఇది ఎక్కడికి వెళుతుందో చూడాలి.

చంద్రబాబునాయుడు అమరావతి ఆహ్వాన పత్రిక ఇవ్వటానికి నలుగురితోబాటే అన్నట్లుగా మంత్రులను పంపించటంపై ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. మీడియావాళ్ళు చిచ్చును పెట్టకపోతే అసలు వాళ్ళ మనసులో ఈ ఆలోచన వచ్చేదికాదేమో. మంత్రులు ఆహ్వానపత్రికను ఇవ్వటానికి వెళ్ళినపుడు రిపోర్టర్‌లు ఈ విషయాన్ని పవన్ వద్ద ప్రస్తావించారు. కేసీఆర్‌ను ఆహ్వానించటానికి స్వయంగా వెళుతున్న చంద్రబాబు మీవద్దకు మాత్రం మంత్రులను పంపించటమేమిటని అడుగగా, ముఖ్యమంత్రిని ఆహ్వానించేటపుడు ప్రొటోకాల్ ప్రకారం ఆయనే స్వయంగా వెళ్ళి ఉంటారని పవన్ బదులిచ్చారు. అయితే ఆయన మాటలకు విరుద్ధంగా చంద్రబాబు నిన్న రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి మరీ రామోజీరావును స్వయంగా ఆహ్వానించటంతో ఫ్యాన్స్ అసంతృప్తి రెట్టింపయింది. ఎన్నికలముందు తమ నాయకుడిని వెతుక్కుంటూ వెళ్ళిమరీ మద్దతుకోసం ప్రాధేయపడిన చంద్రబాబుకు ఇప్పుడు ఆహ్వానపత్రిక ఇవ్వటానికి మాత్రం తీరటంలేదా అంటున్నారు.

మరోవైపు శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన సేన అధినేత పవన్ కళ్యాణ్‌కు ఫోన్ చేసి ఆహ్వానించారు. ఈ విషయాన్ని బాబే వెల్లడించారు. ఇవాళ ఒక టీవీ ఛానల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, పవన్ దగ్గరకు మంత్రులను పంపించానని, తానుకూడా స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించానని చెప్పారు. పవన్ వస్తానన్నారని, వస్తారని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close