కాపు రిజర్వేషన్ల కోసం ఇక ఆమరణ దీక్షలు!

టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లను తొలగించిన సీఎం జగన్ ఇప్పుడు వాటిని పునరుద్ధరించాల్సిందేనన్న ఒత్తిడి పెరుగుతోంది. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు.. ఆ తర్వాత పార్లమెంట్‌లో కేంద్రం ఇచ్చిన క్లారిటీ ప్రకారం… ఆ రిజర్వేషన్లు చెల్లుతాయి. సర్టిఫికెట్లు జారీ చేయడమే మిగిలింది. దీనిపై కాపు వర్గాల్లో ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతోంది. కాపు సంఘాలు వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. తాజాగా.. జనసేన పార్టీ సీనియర్ నేత చేగొండి హరిరామ జోగయ్య … ఆమరణదీక్ష హెచ్చరిక చేశారు.

అగ్రవర్ణాల్లో వీకర్స్ సెక్షన్ కింద కేంద్రం ఇచ్చిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లు కాపులకు అమలు చేస్తూ గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అమలు చేయాలని జోగయ్యకోరుతున్నారు. కాపులకు రిజర్వేషన్ అంశంపై డిసెంబర్ 30వ తేదీలోపు ఉత్తర్వులు జారీ చేయాలని హరిరామ జోగయ్య డెడ్ లైన్ విధించారు. లేకపోతే జనవరి 2 నుంచి నిరహార దీక్ష చేపడతానని హెచ్చరించారు. మూడేళ్లలో సీఎం జగన్‌ కాపులకు అన్యాయం చేశారని జోగయ్య ఆరోపించారు.

ముద్రగడ పద్మనాభం కూడా ఇటీవల సీఎం జగన్ కు ఇటీవల లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఈ డబ్ల్యూ ఎస్ పై ఇచ్చిన తీర్పు, రిజర్వేషన్లు రాష్ట్రాలు అమలు చేసుకోవచ్చని కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానం పై దృష్టి పెట్టాలని లేఖలో ముద్రగడ విజ్ఞప్తి చేశారు. రిజర్వేషన్లపై పరిశీలన చేయాలన్నారు. అందరూ అనుభవించగా మిగిలిన దానిలో తమ రిజర్వేషన్లు ఇప్పించాలని కోరారు. అయితే ముద్రగడ జగన్ ను బతిమాలుకున్నట్లుగా లేఖ రాశారు. దీంతో ఆయనపై కాపుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.

కాపు రిజర్వేషన్ల అంశం.. ముందు ముందు మరింత హైలెట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విషయంలో కీలక పరిణామాలు రాజకీయంగా చోటు చేసుకోనున్నాయని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

ఆ చెంపదెబ్బ వైసీపీ ఎమ్మెల్యేకి కాదు వైసీపీకే !

ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అ పెద్ద అపశకునం వైసీపీకి వచ్చింది. అది కూడా తమ ఎమ్మెల్యేకు చెంపదెబ్బ రూపంలో. తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చెంప...

HOT NEWS

css.php
[X] Close
[X] Close