గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి ?

గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత అభ్యర్థి కిలారు రోశయ్య చేతులెత్తేశారు. రెండు రోజుల కిందట తన మామ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు గెలుపు బాధ్యతలు తీసుకున్న ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డిని రోశయ్య కలిశారు. పార్లమెంట్ సీటులో పోటీ చేయడం తన వల్ల కాదని.. తన పొన్నూరు ఎమ్మెల్యే సీటు తనకు ఇచ్చేయాలని కోరారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా అదే చెప్పారు.

ఆళ్ల అయోధ్య రామిరెడ్డి.. రోశయ్య వద్దనుకుంటున్నారు కాబట్టి.. తన సోదరుడు రామకృష్ణారెడ్డికి సీటిస్తే పోటీ చేస్తామని ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. దానికి జగన్ ఆమోదం లభించాల్సి ఉంది.

మొదట గుంటూరు స్థానానికి క్రికెటర్ అంబటి రాయుడు పేరును సీఎం జగన్ దాదాపుగా ఫైనల్ చేసుకున్నారు. ఆయనను పార్టీలో చేర్చుకున్నారు. అయితే అభ్యర్థిగా అధికారిక ప్రకటన చేయక ముందే ఆయన పార్టీకి రాజీనామా చేశారు. ఆ తర్వాత నర్సరావుపేట ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయులును గుంటూరు నుంచి పోటీ చేాయలని సూచించారు. కానీ ఆయన కూడా పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిపోయి.. నర్సరావుపేట నుంచి పోటీ చేస్తున్నారు.

తర్వాత సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను అభ్యర్థిగా ఖరారు చేశారు. ప్రకటించారు కూడా. కానీ రెండు వారాల పాటు ఆయన నియోజకవర్గం వైపే రాలేదు. తనకు ఆసక్తి లేదని చెప్పడంతో.. ఉమ్మారెడ్డి అల్లుడు అయిన పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారు రోశయ్యకు అభ్యర్థిత్వం ఖరారు చేశారు. ఇప్పుడు ఆయన కూడా తప్పుకుంటున్నారు. పోటీ చేయక ముందే ఇలాంటి పరిస్థితి వల్లే ముందే ఓడిపోయినట్లు అయిందని వైసీపీలో అసంతృప్తి కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close