చంద్రబాబు స్వయంకృతం..! నిప్పులపై దుప్పటేస్తే అంతా బాగుంటుందా..?

“ప్రజలను ఇంత కష్టపెట్టానా..?” అని టీడీపీ అధినేత చంద్రబాబు… ఫలితాలపై ఆవేదనకు గురయినట్లు… ప్రచారం జరుగుతోంది. ప్రజల ఓటింగ్ ప్రయారిటీ ఏమిటో కానీ… ఈ ఫలితాలు రావడంలో మాత్రం.. కచ్చితంగా స్వయంకృతం ఉంది. ప్రజల్లో మారుతున్న అభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు నిజాయితీగా తెలుసుకోలేకపోయారు. తాను పెట్టుకున్న కొన్ని సంస్థలు, వ్యక్తులు.. అనుకూలంగా ఉన్న నివేదికలు ఇచ్చే సరికి అదే నిజమనుకున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత అసలు నిజం తెలిసింది.

ప్రభుత్వానికి ఎవరైనా ప్రభుత్వంపై నెగెటివ్‌గా చెబుతారా..?

నిఖార్సైనా ఫీడ్ బ్యాక్ రావాలంటే… ఆ ఇచ్చే వ్యక్తి ఐడెంటీటీ కోరకూడదు. అలా అయితేనే .. అతను నిజం చెబుతాడు. ఊరు, పేరు, ఫోన్ నెంబర్లు అడిగి… ప్రభుత్వంపై మీ అభిప్రాయం ఏమిటి అంటే… ? టీడీపీ నేతలు ఎలా పని చేస్తున్నారు..? అని అడిగితే ఎవరైనా నిజం చెబుతారా..? ఒక్క శాతం కూడా నిజం చెప్పే అవకాశం లేదు. ప్రభుత్వానికి, అధికార పార్టీకి వ్యతిరేకంగా చెప్పి.. కష్టాలు పడే సాహసం ఎవరూ చేయరు. అందుకే.,. ప్రభుత్వం.. ఇప్పటి వరకూ.. చేసిన.. చేయించుకున్న సర్వేల్లో…. అభిప్రాయసేకరణల్లో… 70, 80 శాతం ప్రజామోదం కనిపించింది. ఆర్టీజీఎస్ సర్వేల్లో ఇదే పరిస్థితి. దీన్నే చంద్రబాబు సానుకూలతగా అనుకున్నారు. కానీ అసలు విషయం .. రహస్య ఓటింగ్‌లో తేలింది.

పార్టీ నేతలు చేసే సర్వేలు వైసీపీకి అనుకూలంగా ఇస్తారా..?

ఇక పార్టీ పరంగా చేసుకున్న సర్వేలు… చేయించుకున్న సర్వేల్లోనూ అదే పరిస్ధితి. అనుకూల సంస్థలు, టీడీపీ నేతల వ్యవస్థలతో… సర్వేలు చేయించుకుని అంతా బాగుందని అనుకున్నారు. అంత అనుకూలత ఎలా ఉంటుంది..?. టీడీపీ నేతల వ్యవహారశైలిపై.. అంత తీవ్రమైన ఆరోపణలు వచ్చినప్పటికి.. ఎందుకు ప్రజల్లో వ్యతిరేకత రాదు.. అనే అంశంపై.. చంద్రబాబు దృష్టి పెట్టలేదు. కొంత మంది విశ్వసనీయమైన సర్వేల పేరుతో.. చంద్రబాబు దగ్గర ప్రాపకం కోసం… ప్రయత్నించడం..చంద్రబాబు దాన్ని నమ్మడంతో… మొదటికే మోసం వచ్చింది. అటు ప్రభుత్వ పరంగా… సరైన ప్రజాభిప్రాయం రాలేదు.. ఇటు పార్టీ పరంగా అసలైన ఫీడ్ బ్యాక్ తీసుకోలేకపోయారు. ఫలితంగా.. మొదటికే మోసం వచ్చింది.

ప్రజాభిప్రాయాన్ని పసిగట్టడంతో చంద్రబాబు ఘోర వైఫల్యం..!

చంద్రబాబుకు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. ప్రజల నాడి పట్టడంలో.. ఆయనకు లెక్క తెలుసు. కానీ.. ఇప్పుడు రాజకీయాలు మరింత డైనమిక్‌గా మారిపోయాయి. ప్రభుత్వం పట్ల ప్రజలు… చివరి వరకూ విశ్వాసంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. కానీ.. ఓటు దగ్గరకు వచ్చే సరికి.. తమ ఆకాంక్షలు బయట పెడుతున్నారు. ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలంటే… అంతకు మించిన ప్రయత్నం చేయాలి. చంద్రబాబు అనుభవం ఇక్కడ పని చేయదు. వంధిమాగధులు ఇచ్చే సర్వే రిపోర్టులు… వారి ప్రయోజనాల కోసమే కానీ… వారికి పార్టీపైనా… ప్రభుత్వంపైనా… బాధ్యత లేదని… అంచనా వేసుకోలేకపోయారు. అన్నింటినీ గుడ్డిగా నమ్మి…కుర్చీ కిందకు నీళ్లు తెచ్చుకున్నారు. నిప్పుల కుంపటిపై దుప్పటి కప్పి… అంతా బాగుందని అనుకున్నారు. కానీ దుప్పటి కాలిపోయింది. కాలిపోతుంది కూడా. అది ప్రకృతి సహజం. టీడీపీ విషయంలోనూ అదే జరిగింది…!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close