ఢిల్లీకి జగన్ – అప్పుల పర్మిషనే ఎజెండా !?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం ఆయన ప్రధాని మోదీతో సమావేశం అవుతారు. ఎప్పట్లాగే సమావేశ ఎజెండా పోలవరం దగ్గర్నుంచి ప్రత్యేకహోదా వరకూ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎప్పుడూ చెప్పే ఎజెండానే ఇది…కానీ అంతర్గత లక్ష్యం ఒకటి ఉంటుందని.. తక్షణం పని పడితేనే ఆయన ఢిల్లీ వెళ్తారని కొంత కాలంగా ఆయన ఢిల్లీ టూర్లనుపరిశీలిస్తే అర్థమవుతుంది. గతంలో ఆయన ఢిల్లీ పర్యటనలో ఇవన్నీ అడిగారో లేదో కానీ..బ్యాంకులకు అప్పులు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలని కేంద్రం ఇచ్చిన సర్క్యూలర్‌ను వెనక్కి తీసుకోవాలని కోరారు.

అప్పటికప్పుడు కొన్ని అప్పుల పర్మిషన్ తెచ్చుకున్నారు. వీటికి సంబంధించిన లేఖలు బయటకు వచ్చాయి. ఈ సారి కూడా అలాంటి అజెండా ఉందని భావిస్తున్నారు. ఎందుకంటే కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది.రాష్ట్రాలకు కొత్త అప్పలకు కేంద్రం పర్మిషన్ ఇవ్వాల్సి ఉంది. ఆ అనుమతులు ఇంకా రాలేదు. అవి రాకుండా ఆర్బీఐ దగ్గర బాండ్లు వేయడానికి కుదరదు. దీంతో సమస్యలు వస్తాయి. ఇప్పటికే వేస్ అండ్ మీన్స్ సౌకర్యాన్ని ప్రభుత్వం వాడుకుంది. ఉద్యోగులకు ఇంత వరకూ జీతాలు ఇవ్వలేదు. ఈ సమస్యల పరిష్కరానికి సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లడమే మార్గమని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.

మంగళవారం పర్యటన తర్వాత ఏపీకి సంబంధించి అప్పుల కోసం ఏమైనా పర్మిషన్లు వస్తాయో లేదో చూడాలి. ఇప్పటికే శ్రీలంక పరిస్థితులు.. కేంద్రాన్ని కూడా అప్రమత్తం చేస్తున్నాయి. పలువురు ప్రధాన కార్యదర్శులు కూడా ఇదే విషయాన్ని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీకి గతంలోలా ధారాళంగా అప్పులకు అవకాశం ఇచ్చే పరిస్థితి లేదని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close