అదానీ విదేశీ పెట్టుబడులన్నీ ఇక్కడి సొమ్మే !?

దేశ పారిశ్రామిక దిగ్గజాల్లో ఎవరిపైనా రానటువంటి ఆరోపణలు అదానీ గ్రూప్ పై వస్తున్నాయి. గతంలో హిండెన్ బెర్గ్ రిపోర్టు బయట పెట్టిన విషయాలను అవాస్తవాలు అని నిరూపించుకోలేకపోయారు. సెబీతో దర్యాప్తు పేరుతో అలా బండి నడిపించేస్తున్నారు. కానీ నిజాలేమిటో కళ్ల ముందే ఉన్నాయి. తాజాగా మరో అంతర్జాతీయ ఇన్వెస్టిగేషన్ సంస్థ.. అదానీ గ్రూప్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఇండియా నుంచే బిలియన్ డాలర్లను బయటకు తరలించి వాటినే విదేశీ పెట్టుబడులుగా అదానీ గ్రూపుల్లోకి పంపాలని నివేదిక వెల్లడించింది.

దీినిపై పక్కా సాక్ష్యాలతో కథనాలు వెలువవడ్డాయి. గౌతమ్ అదానీ తమ్ముడు వినోద్ అదానీ ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపారని..ఇద్దరు విదేశీయులైన తన కంపెనీలోని డైరక్టర్లతో .. అదానీ కంపెనీల్లోకి విదేశీ పెట్టుబడులను ప్రవహింపచేశారని ఆరోపించారు. ఇలా చేయడానికి కారణం అదానీ స్టాక్ ధరలు పెంచడమే. ఇష్టారీతిన అదానీ గ్రూప్ షేర్ల ధరలు పెంచుకుని వాటి ద్వారా..పోర్టులు, ఎయిర్ పోర్టులు సహా అనేక ఆస్తులు అదానీ కొనుగోలు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఆరోపమల్ని అదానీ గ్రూప్ ఎప్పటిలాగే తిరస్కరించింది. హిండెన్ బెర్గ్ చేసిన ఆరోపమల్నే మళ్లీ చేశారని ఆరోపించారు. వీటిపై గతంలోనే తమకు క్లీన్ చిట్ వచ్చిందని చెప్పుకుంది. తమపై ఇలాంటి ఆరోపణలతో కుట్రలు చేస్తోంది జార్జ్ సోరోస్ అనే వ్యక్తి అని..ఆయన ఇండియాపై కుట్ర చేస్తున్నారని అదానీ గ్రూప్ ఆరోపిస్తోంది. జార్జ్ సోరోస్ ను ఇటీవలి కాలంలో బీజేపీ దేశానికి ఓ విలన్ లాగా ప్రొజెక్ట్ చేస్తోంది. బూచిగా చూపిస్తోంది. ఇప్పుడు అదానీ కి కూడా ఆయన బూచి అయ్యారు.

మొత్తంగా అదానీ గ్రూప్ పై దేశంలో నిష్ఫాక్షిక విచారణ జరగడం లేదు. ఏదో విధంగా మసిపూసి కథను మగించేద్దామనుకున్నట్లుగా చేస్తున్నారు. కానీ అదానీ గ్రూపులో వెదికితే… మొత్తం డొల్లతనమే కనిపిస్తోందని దేశం బయట నుంచి చూసే వారి నివేదికలు వెల్లడించాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close