స్వీటీ కి నాలుగేళ్లు నో టెన్షన్…

క‌థానాయిక‌ల‌కు ఎప్పుడో ఒక టైమ్‌లో రిటైర్మెంట్ త‌ప్ప‌దు. సినిమాల‌పై మ‌రీ అంత ఆస‌క్తి వుంటే క్యారెక్ట‌ర్ ఆరిస్టులుగానో, ఇత‌ర‌ కీల‌క పాత్ర‌ల్లో కెరీర్‌ను కొన‌సాగిస్తారు. 35ఏళ్లు దాటాక కూడా నాయిక‌లుగా రాణించిన‌వాళ్లు అరుద‌గ‌నే చెప్పాలి. అయితే ఈ ట్రెండ్‌ను తిర‌గ‌రాస్తానంటున్న‌ది అనుష్క‌. మ‌రో నాలుగేళ్ల‌పాటు క‌థానాయిక‌గా త‌న కెరీర్‌కు ఢోకా లేదంటున్న‌ది. భాగ‌మ‌తి చిత్రం త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు మ‌రే చిత్రానికి అంగీక‌రించ‌లేదు అనుష్క‌. తాజాగా మాధ‌వ‌న్ హీరోగా ఓ సినిమా చేయ‌బోతున్న‌ది. కోన కార్పోరేష‌న్‌, పీపుల్స్ మీడియా సంస్థ‌లు ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాయి. ఈ సినిమాతో పాటు ఆదిపినిశెట్టితో క‌లిసి ఓ లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని ఫిలిం న‌గ‌ర్ వ‌ర్గాల్లో వినిపిస్తున్న‌ది. త‌మిళంలో కూడా ఓ మ‌హిళా ప్ర‌ధాన ఇతివృత్తంతో ఓ థ్రిల్ల‌ర్ చిత్రం చేసే ఆలోచ‌న‌లో వున్న‌ట్లు తెలిసింది. ఈ సినిమాల‌న్ని చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకొని విడుద‌ల‌డానికి మ‌రో రెండేళ్లు ప‌డుతుందంటున్నారు. ఈలోగా మ‌రికొన్ని సినిమాలు అనుష్క ఓకే చేసిన‌ట్ల‌యితే న‌ల‌భై ఏళ్ల వ‌ర‌కు నాయిక‌గానే రాణించే అవ‌కాశాలు వున్నాయ‌ని చెబుతున్నారు. త‌న స‌న్నిహిత‌లు వ‌ద్ద కూడా అనుష్క ఇదే మాట‌ను చెబుతోంద‌ని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.