కేంద్రమంత్రులతో ఏపీ బీజేపీ మొక్కుబడి ప్రయత్నాలు !

అన్ని రాష్ట్రాల్లోనూ హడావుడి చేస్తున్న బీజేపీ నేతలు ఏపీలో మాత్రం సైలెంట్ గా ఉన్నారు. వారెందుకు రాజకీయ కార్యక్రమాలు చేపట్టరు అని జనం కూడా ఆలోచించరు. ఇటీవల సోము వీర్రాజు ఉత్తరాంధ్ర యాత్ర అని ప్రారంభించారు కానీ పట్టించుకున్నవారు లేరు. కేంద్రమంత్రులు ఎవరూ రాకపోవడం … జాతీయ స్థాయి నాయకులు అనేవారు ఏపీవైపు చూడకపోవడంతో ఏపీలో పార్టీకి అసలు ఎలాంటి ప్రచారమూ దక్కడం లేదు. ఉనికి కనిపించడం లేదు . వస్తే జీవీఎల్ లేకపోతే ఇంకెవరూ రాలేదు. జీవీఎల్ చెప్పే మాటలు విని విని ఏపీ ప్రజలకు విసుగొచ్చింది.

ఒకే క్యాసెట్‌ను పదే పదే రిపీట్ చేస్తూంటారు ఆయన. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి… ఏమీ చేయడం లేదన్న అభిప్రాయం ఇప్పుడు హైకమాండ్‌కు వచ్చిందేమో కానీ.. కేంద్ర మంత్రుల్ని ఏదైనా కార్యక్రమాలకు ఏపీకి పంపాలని నిర్ణయించుకుంది. అధికారిక కార్యక్రమం మీద వచ్చినా పార్టీ కార్యక్రమాలు సహజంగానే ఉంటాయి కాబట్టి ఈ వ్యూహం అమలు చేస్తున్నారని అనుకోవచ్చు. ఈ నెలలోనే పీయూష్ గోయల్ , ధర్మేంద్ర ప్రధాన్, జైశంకర్ వంటి కేంద్రమంత్రులు ఒక్కో వారం ఒక్కొక్కరు ఏపీలో పర్యటించడానికి షెడ్యూల్ ఖరారైంది.

వారు ఏ కార్యక్రమాల్లో పాల్గొంటారో స్పష్టత లేదు కానీ.. కేంద్రమంత్రులు వస్తున్నారంటే కాస్త రాజకీయం ఉండటం సహజమే . దీన్ని ఎలా బీజేపీ వాడుకుటుందనేది కీలకం. వచ్చిన వారు ముఖ్యమంత్రితో సమావేశమైతే.. మొత్తానికే మోసం వస్తుంది. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే.. ఏదైనా కొంచం మైలేజీకి చాన్స్ ఉంటుంది. కానీ అలాంటి అవకాశాలు ఉన్నాయా అనేదే ఏపీ బీజేపీ నేతల ఫేట్ మీద ఆధారపడి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close