ఇక మధ్యతరగతి వారి కోసం జగన్ ఇళ్ల పథకం..!

పేదలందరికీ.. సెంటు.. సెంటున్నర చొప్పున పంచి.. ఇళ్లు కూడా ఊళ్లను నిర్మిస్తున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి… ఈ సారి మధ్య తరగతి కోసం వినూత్నమైన ఆలోచన చేశారు. మున్సిపల్ శాఖపై నిర్వహించిన ఈ సమీక్షలో జగన్మోహన్ రెడ్డి.. తన ఆలోచనను అధికారుల ముందు ఉంచారు. మున్సిపాలిటీలలో మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు… లే ఔట్లు అభివృద్ధి చేయాలని… క్లియర్ టైటిల్‌తో తక్కువ ధరకు వాటిని ప్రజలకు అందించాలన్నారు. ఇళ్లు లేని మధ్యతరగతి ప్రజలు… ప్రభుత్వం ఇచ్చే పేదల ఇంటి పథకం కింద స్థలం పొందలేకపోయారు. వారిలో అసంతృప్తి ఉంది… ఆ అసంతృప్తిని..తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. తాను చెప్పిన అంశంపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.

వైఎస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇలాంటి ప్రయత్నం జరిగింది. రాజీవ్ స్వగృహ పేరుతో భారీ అపార్టుమెంట్లను మధ్యతరగతి ప్రజలకోసం కట్టించారు. కానీ అవి నిర్వహణ సమస్యల వల్ల ఫెయిలయ్యాయి. అయితే జగన్మోహన్ రెడ్డి అపార్టుమెంట్ సంస్కృతికి వ్యతిరేకంలా ఉన్నారు. పేదలకు ఆయన బహుళ అంతస్తుల్లో ఇళ్లు ఇవ్వడం కన్నా.. ఎంతో కొంత స్థలంలో ఇళ్లు ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే.. ఇళ్ల పథకాన్ని రూపొందించారు. ఇప్పుడు మధ్యతరగతి వారికి అందుబాటులోకి తేవాలనుకుంటున్న ఇళ్లు కూడా అపార్టుమెంట్లు కాకుండా.. గేటెడ్ కమ్యూనిటీల్లోలా ఉండేలా ప్లాన్ చేసే అవకాశం ఉంది.

అయితే… ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం అని ఆరోపణలు విమర్శలు వచ్చే అవకాశం ఉంది. గతంలో అమరావతిలో గత ప్రభుత్వం హ్యాపీనెస్ట్ పేరుతో ఇళ్లను అమ్మకానికి పెడితే.. తీవ్రమైన ఆరోపణల్ని వైసీపీ చేసింది. అయితే.. అది లాభాల కోసం చేసిందని.. తాము ప్రజలకు ఇంటి వసతి కల్పించడానికి చేస్తున్నామని వైసీపీ వాదించే అవకాశం ఉంది. విమర్శలు ఆరోపణలు ఎన్ని వచ్చినా మార్కెట్ రేటు గురించి పట్టించుకోకుండా.. ప్రజలకు నామమాత్ర ఖర్చుతో మంచి ఇళ్లు నిర్మించి ఇస్తే.. అది ప్రభుత్వానికి గొప్ప పేరు తెచ్చి పెడుతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

మెకానిక్ గా మారిన మాస్ కా దాస్

ఈమ‌ధ్యే 'గామి'గా ద‌ర్శ‌న‌మిచ్చాడు విశ్వ‌క్‌సేన్‌. త‌న కెరీర్‌లో అదో వెరైటీ సినిమా. ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు, విమ‌ర్శ‌కుల మెచ్చుకోళ్లూ ద‌క్కాయి. త‌ను న‌టించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి' విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. ఇప్పుడు మ‌రో...

“చెంగిచెర్ల” మీదుగా బీజేపీ ఎలక్షన్ ప్లాన్లు !

మేడ్చల్ నియోజకవర్గం చెంగిచెర్ల గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఘర్షణ జరిగింది. డీజే పాటలు పెట్టుకొని హోలీ సంబరాలు చేసుకుంటుండగా.. మరో వర్గానికి చెందిన వారు ఆ పాటలు ఆపాలని కోరారు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close