అశోకే మాన్సాస్ చైర్మన్.. మరోసారి తేల్చిన హైకోర్టు..!

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌గా అశోక్ గజపతిరాజే కొనసాగుతారని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వం గతంలో అశోక్ గజపతిరాను తొలగించి సంచయిత చైర్మన్‌గా నియమించడాన్ని హైకోర్టు సింగిల్ బెంచ్ కొట్టి వేసింది. అశోక్ గజపతిరాజు చైర్మన్‌గా కొనసాగుతారని స్పష్టం చేసింది. ఈ తీర్పుపై డివిజన్ బెంచ్‌లో ప్రభుత్వంతో పాటు సంచయిత కూడా సవాల్ చేశారు. కానీ హైకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని బెంచ్ ఆ పిటిషన్లను కొట్టివేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. తదుపరి విచారణను డిసెంబర్‌కు వాయిదా వేసింది. రెండు రోజుల కిందట ఊర్మిలా గజపతిరాజు కూడా అశోక్ ను తొలగించి తనకు చాన్సివ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు.

దానికి ఆమె చెప్పిన కారణం… ప్రభుత్వం తనను కూడా వారసురాలిగా గుర్తించిందని చెప్పడం. అయితే కొట్టి వేసిన జీవోను చూపించి ఆమె హైకోర్టులో పిటిషన్ వేయడంతో ఆమె పిటిషన్ విచారణలో నిలవదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అశోక్ గజపతిరాజే చైర్మన్‌గా కొనసాగుతారని హైకోర్టు స్పష్టం చేయడంతో ఆమె పిటిషన్ కు కూడా ఈ తీర్పు వర్తిస్తుందని అంచనా వేస్తున్నారు. మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంపై గతంలో ఎలాంటి వివాదాలు ఉండేవి కావు. కానీ ఏపీ ప్రభుత్వం హఠాత్తుగా ఆనందగజపతిరాజు మొదటి భార్య కుమార్తెను … అర్థరాత్రి జీవోల ద్వారా మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్‌ను చేయడంతో ఒక్క సారిగా వివాదం ప్రారంభమయింది. ఆయన ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపోరాటం చేసి విజయం సాధించారు.

ఆ తర్వాత ప్రభుత్వం వైపు నుంచి అనేక రకాల ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నారు. విచారణ పేరుతో మాన్సాస్ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదు. అయితే ఆయన ఆ అంశంపైనా పిటిషన్ వేసి.. హైకోర్టు నుంచి అనుకూల ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కారణం ఏమిటో కానీ మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజు ఉండకూడదని వైసీపీ నేతలు పట్టుదలగా ఉన్నారు. అయితే ఆ ట్రస్ట్ కోసం అశోక్ గజపతిరాజు పూర్వికులు ఇచ్చిన లక్షల కోట్ల విలువైన భూములపై వైసీపీ నేతల కన్ను పడిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎవరీ రామసహాయం రఘురామ్ రెడ్డి..?

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది.అనేకపేర్లు తెరమీదకు వచ్చినా అనూహ్యంగా అధిష్టానం రామసహాయం పేరును అభ్యర్థిగా ఖరారు చేయడంతో ఈయన ఎవరు అనే చర్చ జోరుగా జరుగుతోంది....

“సివిల్ సర్వీస్” ఇమేజ్ జగన్ పాలనలో డ్యామేజ్ !

సివిల్ సర్వీస్ అధికారి అంటే ఓ గౌరవం.. ఓ మర్యాద. కానీ ఏపీలో సివిల్ సర్వీస్ అధికారులు చేస్తున్న పనులు చూసి.. కోర్టులు కూడా అసలు మీకెవరు ఉద్యోగం ఇచ్చారయ్యా అని అసహనపడాల్సి...

తీన్మార్ మల్లన్న – ఈ సారి ఎమ్మెల్సీ పక్కా !

తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ..తెలంగాణ రాజకీయల్లో పరిచయం లేని వ్యక్తి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ కు సపోర్టుగా ఉన్నారు. ఆయన పేరును కరీంనగర్ లోక్ సభకు కూడా...

మేనిఫెస్టో మోసాలు : పట్టగృహనిర్మాణ హామీ పెద్ద థోకా !

జగన్మోహన్ రెడ్డి తాను చెప్పుకునే బైబిల్, ఖురాన్, భగవద్గీతలో అయిన మేనిఫెస్టోలో మరో ప్రధాన హామీ పట్టణ గృహనిర్మాణం. మూడు వందల అడుగుల ఇళ్లు ఇచ్చి అడుగుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close