ఇద్దరు ఏపీ ఐఏఎస్‌లకు వారం రోజులు జైలు శిక్ష..!

ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు ఐఏఎస్‌ అధికారులకు హైకోర్టు వారం రోజులు జైలు శిక్ష శిక్ష విధించింది. హైకోర్టు ఉత్తర్వులను ఎన్ని సార్లు ఆదేశించినా చేయకపోవడంతో సహనం నశించిన హైకోర్టు… చివరికి శిక్ష విధించింది. తమ ఉద్యోగాలను నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేయాల్సి ఉన్న చేయలేదంటూ.. 36 మంది ఉద్యోగులు గతంలో కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. అందర్నీ రెగ్యులరైజ్ చేయాలని.. ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచి రెగ్యులరైజ్‌ చేయకపోవడంతో వారు మళ్లీ కోర్టును ఆశ్రయించారు. పలుమార్లు ఉత్తర్వులు అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ పట్టించుకోలేదు.

చివరికి హైకోర్టు తమ ఆదేశాలు అమలు చేయాల్సిన బాధ్యతల్లో ఉండి నిర్లక్ష్యం ప్రదర్శించిన చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్‌లకు వారం జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టు ధిక్కరణ కేసులో.. చిరంజీవిచౌదరి, గిరిజాశంకర్‌ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. వారి సమక్షంలోనే హైకోర్టు తీర్పు చెప్పింది. ప్రభుత్వ పెద్దల ఒత్తడి వల్లే ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయలేదని.. ఇప్పుడు… వారు శిక్ష అనుభవిస్తున్నారని అధికారవర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. వైసీపీ ప్రభుత్వంలో అనేక మంది సివిల్ సర్వీస్ అధికారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్‌లు పడ్డాయి.

ప్రభుత్వం చెప్పినట్లుగా చేస్తు్న్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు చట్టాలు.. రాజ్యాంగాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఫలితంగా కేసుల పాలవుతున్నారు. గతంలో పలువురు అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఐఏఎస్ ప్రవీణ్ కుమార్.. ఐపీఎస్ సునీల్ కుమార్ వాంటి వారిపై కోర్టు ధిక్కరణ కేసులకు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఈ పరిణామాలతో అధికారవర్గాల్లో అలజడి రేగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ముగ్గురు ఎస్పీలు, కలెక్టర్‌పై వేటు – ఈసీ కఠిన చర్యలు

ఏపీలో ఎన్నికల అనంతర హింసపై ఈసీ కొడఢా ఢుళిపించింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలపై సస్పెన్షన్ వేటు, శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. తిరుపతి ఎస్పీపై బదిలీ వేటుతో పాటు శాఖాపరమైన విచారణకు ఆదేశాలు...

పవన్ పోటీ చేసిన పిఠాపురంలో బిగ్ డిబేట్ ఇదే..!!

ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి పిఠాపురం నియోజకవర్గంనే నెలకొంది. కూటమి గెలుపు అవకాశాలపై ఎంత చర్చ జరుగుతుందో అంతకుమించిన స్థాయిలో పవన్ గెలుపు అవకాశాలపై డిస్కషన్ కొనసాగుతోంది.పవన్ గెలుపు...

కౌంటింగ్‌కు ముందే జీవోల క్లీనింగ్ !

ఏపీ అధికారులు తొందర పడుతున్నారు. ఓ వైపు పోలింగ్ జరిగి తీర్పు ఈవీఎంలలో ఉన్న సమయంలో అనుమానాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆఫీస్ సాఫ్ట్ వేర్ అప్ గ్రేడ్ పేరుతో మూసేస్తున్నారు. ఈ...

ఏపీ పోలీసు అధికారులపై మరో సారి ఈసీ కొరడా రెడీ !

ఏపీలో ఎన్నికల కోడ్ ఉన్నంత వరకూ ఏ చిన్న ఘటన జరిగినా కఠిన చర్యలు తీసుకునేందుకు ఈసీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో ఎన్నికల సంఘం ఎదుట ఏపీ సీఎస్, డీజీపీ హాజరయ్యారు. ఏపీలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close