బాలయ్య సినిమాలో అరవింద్ విలన్..!

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 99వ సినిమా డిక్టేటర్ షూటింగ్లో బిజీగా ఉన్నాడు. 100వ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఆల్రెడీ బోయపాటి సిద్ధం చేసే ప్రయత్నంలో నిమగ్నమయ్యాడు.బయటకు వచ్చిన ఎక్స్ క్లూజివ్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో విలన్ గా అరవింద్ స్వామి ఓకే అయ్యాడట. రీసెంట్ గా జయం రవి తని ఒరువన్ రీమేక్లో ప్రతినాయకుడి గెటప్లో కనిపించి సినిమా సక్సెస్ కు కారణమైన అరవింద్ స్వామి బాలయ్య సినిమాలో కూడా విలన్ రోల్ చేస్తున్నాడట. అయితే తని ఒరువన్ తెలుగు రీమేక్ లో నటించడానికి ముందు నో అని చెప్పినా ఎలాగోలా ఆయన్ని కన్విన్స్ చేశారు దర్శక నిర్మాతలు.

చరణ్ సినిమాకు అంత ప్రయత్నిస్తే గాని ఓకే చెప్పని అరవింద్ స్వామి.. బాలయ్య బోయపాటి సినిమాకు అడగగానే గ్రీన్స్ సిగ్నల్ ఇచ్చాడట. చరణ్ సినిమాకు అంత ఏడిపించిన ఈ హ్యాండ్సం హీరో ఎందుకు బాలయ్య సినిమా అనగానే వెంటనే ఓకే చెప్పాడో తెలియట్లేదు. టాలీవుడ్ మెగా పవర్ స్టార్ సినిమా అంటే అదో క్రేజ్ మరి అలాంటిది అలాంటి పెద్ద హీరో సినిమాను ఎందుకు ముందు కాదన్నాడో తెలియాల్సి ఉంది. అయితే అసలు కారణం మాత్రం ఆల్రెడీ తని ఒరువన్ తమిళ్ లో నటించి సేమ్ క్యారక్టర్ ని చేయాలనే ఇంట్రెస్ట్ లేదనే ఆలోచనతోనే ముందు తెలుగు రీమేక్ కి నో చెప్పినా భారీ స్థాయిలో కమెండేషన్ రావడంతో చేయక తప్పట్లేదు.

ఒకేసారి అటు బాలయ్య ఇటు రాం చరణ్ సినిమాలతో విలన్ గా రీ ఎంట్రీ ఇస్తున్న అరవింద్ స్వామి ఎలాంటి రిజల్ట్ ని ఇస్తాడో తెలుసుకోవాలంటే సినిమా వచ్చేదాక వ్యిట్ చేయాల్సిందే. అంతేకాదు బాలయ్య సినిమాలో ఇంకా ఎవరెవరు కాస్ట్ అండ్ క్రూ ఉన్నారనేది కొద్దిరోజుల్లో తెలుస్తుందో.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close